(TTD Solar Power) చిత్తూరు: విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దృష్టి సారించింది. ఒకవైపు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూనే.. మరోవైపు విద్యుత్పై చేసే ఖర్చులను ఇతరత్రా పనులకు వాడేందుకు యోచిస్తున్నది. ఇందుకోసం సౌర విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి 2 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలని కార్యాచరణ సిద్ధం చేశారు. సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని తీసుకొస్తే టీటీడీ కరెంట్పై చేసే ఖర్చులో దాదాపు 10 శాతం మేర ఆదా అవుతాయని టీటీడీ వర్గాలు చెప్తున్నాయి.
తిరుమల, తిరుపతి దేవస్థానం ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్, మిగతా 70 శాతం ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా సరఫరా అవుతుంది. టీటీడీ దాదాపు రూ.40 కోట్ల వరకు విద్యుత్పై ఖర్చు చేస్తున్నది. విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేయడం ద్వారా కనీసం 10 శాతం ఆదా చేయొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్ఈడీసీఏపీ), జాతీయ స్థాయి ఏజెన్సీల సహకారంతో టీటీడీ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల భవనాలపై 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో విద్యుత్ పొదుపు కార్యక్రమాలు చేపడుతున్నామని టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా బీఈఈ స్టార్ రేటెడ్ పరికరాల వినియోగంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుమల, తిరుపతిలో ఎలక్ట్రిక్ రవాణా సౌకర్యాలను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఈ చర్యల వల్ల విద్యుత్ వినియోగం తగ్గి భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..