హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్యాదవ్ను పదిరోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసులో సునీల్యాదవ్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ వాదించింది. దీనితో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు సునీల్ను సీబీఐ కస్టడీకి తీసుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. దీంతో సీబీఐ అధికారులు శుక్రవారం సాయంత్రం కస్టడీలోకి తీసుకున్నారు. వివేకానంద ఇంటి వాచ్మెన్ రంగన్న వాంగ్మూలం తర్వాత పరారైన సునీల్ ఇటీవల గోవాలో పట్టుబడ్డాడు. అక్కడి నుంచి కడప జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్