(New Education Policy) విజయవాడ: వచ్చే నెల 1 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల 3 నుంచి 5 తరగతులు ఉన్నత పాఠశాలలో భాగం అవుతాయి. కాగా, 1, 2 తరగతులు ఎప్పటిమాదిరిగానే పనిచేస్తాయి. 1, 2 తరగతులకు టీచర్-విద్యార్థి నిష్పత్తి 1:30 గా సెకండరీ గ్రేడ్ టీచర్లను కేటాయించనున్నారు.
ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్తో పాటు మిగిలిన ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో నియమితులవుతారు. వీరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నియంత్రణలోకి వస్తారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఇలాంటి ఉన్నత పాఠశాలలు 3 నుంచి 10 వ తరగతులను నిర్వహిస్తారు. 3 నుంచి 10 తరగతుల వరకు బోధించడానికి అర్హత కలిగిన ఒకవేళ సీనియర్ ఎస్జీటీలు లేనిపక్షంలో.. అర్హత కలిగిన జూనియర్ ఎస్జీటీల సేవలను రీ డిప్లాయిమెంట్ కోసం పరిగణించనున్నారు. 3 నుంచి 10 తరగతుల వరకు పాఠశాలలు నిర్వహించేందుకు తగిన భవనాలు అందుబాటులో లేనిపక్షంలో ప్రాథమిక పాఠశాలల్లోనే తరగతులు కొనసాగించనున్నారు. ఉపాధ్యాయులను కేటాయించే బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులు చూడనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..