అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన పలా-కాశిబుగ్గ మున్సిపాలిటీలో జరిగింది. రైలు పట్టాల వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Iranian ships | ఇరాన్ నౌకలకు లైన్ క్లియర్.. ఆంక్షలు ఎత్తివేసిన యూఎస్
Saikrishna Missing | సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై కేసు నమెదు