(Minister Kannababu) అమరావతి: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 2019-21 మధ్య కాలంలో 11.3 శాతం వృద్ధిరేటుతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సుపరిపాలన సూచీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని, రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీకే రుణాలు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాలు సరఫరా చేయడం నుంచి పంటల కొనుగోళ్ల వరకు ఆదుకుంటున్నదని మంత్రి కన్నబాబు చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నదన్నారు. 2017-19 లో వృద్ధి రేటు 6.3 శాతం మాత్రమే ఉండగా.. సీఎం జగన్ చేసిన కృషి కారణంగా అది 11.3 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఉద్యానవన ఉత్పత్తుల వృద్ధి 4.7 శాతం నుంచి 12.3 శాతం కాగా, పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించడంతో పాల ఉత్పత్తి 1.4 శాతం నుంచి 11.7 శాతానికి ఎగబాకి కొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు. మాంసం ఉత్పత్తిలో వృద్ధి మైనస్ 6.7 శాతం నుంచి 10.3 శాతానికి చేరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..