Second Marriage | తనను రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదని భార్యను ఓ భర్త దారుణంగా చితకబాదాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం పీ వేమవరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మణికంఠ, దేవి 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా.. మణికంఠ తన మేనకోడలును రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మణికంఠ తన భార్య దేవిని రోడ్డు మీద కింద పడేసి దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ దేవి సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రెండో వివాహం చేసుకోవడానికి భార్య ఒప్పుకోలేదని దారుణంగా కొట్టిన భర్త
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ వేమవరంలో ఘటన
2021లో ప్రేమ వివాహం చేసుకున్న మణికంఠ, దేవి
దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పని చేస్తుండగా.. మేనకోడలును రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మణికంఠ
ఈ క్రమంలో… pic.twitter.com/2J78QtgaW2
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Odisha | మద్యం మత్తులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య, కోడలు, మనవరాలి హత్య
Jasveer Singh | ముందుగా రూ.28 లక్షలకు ఒకే చెప్పిన టెకీ.. ఆపై రూ.36 లక్షలిస్తేనే చేరుతానని మెలిక..!