(Yogi Vemana Versity) కడప : రోజురోజుకు మెస్ బిల్లులు పెంచుతుండటంతో నానా ఇబ్బందులు పడుతున్నామని కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వాపోయారు. పెరిగిన మెస్ బిల్లులను వెంటనే తగ్గించాలని కోరుతూ వారు యూనివర్శిటీ ప్రాంగణంలోని హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్పై ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, విద్యార్థులు ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. వారి సమస్యను ఆలకించే నాథుడు కరువయ్యారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెస్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు రోడ్డెక్కారు. వర్శిటీ ప్రాంగణంలోని హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. నెలకు రూ.3 వేలు చెల్లించాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. హాస్టల్ అభివృద్ధి కోసం నెలనెలా రూ.250 చెల్లిస్తున్నా.. ఎలాంటి అభివృద్ధి కానరావడం లేదని వారు వాపోయారు. ఇక్కడ చదువుకుంటున్న వారిలో ఎక్కువ మంది గ్రామాలకు చెందిన వారు ఉన్నారని, వేలల్లో బిల్లులు చెల్లించడం కన్నా చదువు మానేయడం ఉత్తమం అని భావిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని మెస్ బిల్లులు తగ్గించాలని కోరారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..