(AP Rain Alert) విజయవాడ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. అత్యవసర పనులు ఉంటేనే కానీ ప్రజలెవరూ ఇండ్లు విడిచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. తుపాన్ ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించే అవకాశమున్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.
గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు తిరుమల తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమల ఆలయంతో పాటు వీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లు, వసతి సముదాయాలు జలమయమయ్యాయి. ఆలయ మాడ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లోకి చేరిన వర్షపు నీటిని మోటార్లతో ఆలయ సిబ్బంది తోడేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ చర్చలు తీసుకుంటున్నది.
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ గురువారం ఉదయం సమీక్ష జరిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని.. ఈ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని జగన్ తెలిపారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..