(CPI Narayana) అమరావతి : తిరుపతిలో ఈ నెల 14న 29వ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనున్నది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, సీనియర్ అధికారులు హాజరవుతారు. ఈ సమావేశం కోసం తిరుపతిలోని తాజ్ హోటల్ను ముస్తాబు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు. వాహనాల తనిఖీలు జరుపుతున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, తిరుపతిలో జరపతలపెట్టిన కౌన్సిల్ సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమావేశంతో ఒరిగేదేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలాంటి ఎన్ని సమావేశాలు పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. ఇదంతా దక్షిణాన పాగా కోసం పాకులాడటం తప్ప మరేం లేదని విమర్శించారు. జీఎస్టీ, విద్యుత్ సంస్కరణలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు ప్రశ్నించడం లేదని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్రం ఎందుకు గుర్తించడం లేదన్నారు. అమిత్ షా పర్యటన ముగిసే వరకు ప్రతిపక్షాలు బయటకు రాకూడదని హుకుం జారీ చేయడం ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా నల్లజెండాలతో నిరసన తెలుపుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాటవేస్తున్న కేంద్రం తీరుకు నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..