హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో రైతుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి యూరియాను బ్లాక్లో అమ్ముకొని, కొరత వచ్చిందని కేంద్రంపై నెడుతున్నాడని ఆరోపించాడు.
తెలంగాణకు 2016-17లో 26.13 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇస్తే.. 2025-26లో 42.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం నుండి ఇచ్చామని పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి జూలై మధ్యలో డీఏపీలలో 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్ఐఆర్లు నమోదవ్వగా వీఇపై ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరూ కాంగ్రెస్ వాళ్లేనని తేలిందన్నారు. ప్రభుత్వం అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి యూరియాను బ్లాక్లో అమ్ముకొని, కొరత వచ్చిందని కేంద్రంపై నెడుతున్నాడు
తెలంగాణకు 2016-17లో 26.13 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇస్తే.. 2025-26లో 42.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం నుండి ఇచ్చాం
ఏప్రిల్ నుండి జూలై మధ్యలో DAPలో 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్… pic.twitter.com/Pd9RdxSjtd
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026