(NIT Convocation) పశ్చిమ గోదావరి : విద్యార్థులే సాంకేతికత సారథులని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు తీసుకొస్తున్నదని డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ జీ సతీష్రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2,3వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పలువురు విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు పట్టాలు అందజేశారు. 2016-20, 2017-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన 793 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. స్నాత కోత్సవాన్ని నిట్ పాలకమండలి అధ్యక్షురాలు మృదులా రమేష్ ప్రారంభించగా.. డైరెక్టర్ సీఎస్పీ రావు నిట్ ఆరంభం నుంచి ఇప్పటివరకు పరిణామాలు, అభివృద్ధి, క్యాంపస్ ఇంటర్య్వూలు, కొత్త కోర్సులు గురించి వివరించారు.
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కార్తీక్రెడ్డి 2016-20లో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అనూష 2017-21లో టాపర్లుగా నిలిచారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులకు బంగారు పతకాలను సతీష్ రెడ్డి అందించారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న వివిధ సాంకేతికాంశాలను సమాజం అభ్యున్నతికి వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ పైకి రావాలని, ఇందుకు నిట్ మంచి మార్గదర్శిగా నిలవడం సంతోషకరమన్నారు. పరిశోధనలపై కూడా మక్కువ పెంచుకోవాలని, స్టార్టప్స్ ఎక్కువగా వచ్చేలా కృషిచేయాలని సూచించారు.
నాన్నకు ప్రేమతో.. ఆ కూతురు ఏం చేసిందంటే..?
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..