హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు మండలాల్లో… మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్వహించనుంది. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉండగా… మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.
ఒంటిగంటలోపు ఉపసంహరణకు అవకాశం ఉండగా.. అదే సమయంలో ఎన్నికల అధికారి కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనున్నారు.