పశ్చిమ గోదావరి : (West Godavari) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. కొడుకు మరణాన్ని తాళలేక అమ్మ, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భీమవరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అనే యువకుడు రెండు రోజుల క్రితం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసినప్పటి నుంచి ఆ యువకుడి తల్లి ఇందిర (50) అమ్మమ్మ కుమారి (75) లు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కుమారుడు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని తల్లి, అమ్మమ్మలు ఇవాళ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..