(Fraud) తెనాలి : కుటుంబ అవసరాల కోసం చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో పొదుపు చేసుకోగా.. వీరి బలహీనతలను ఆసరగా చేసుకుని ఓ కుటుంబం పెద్ద కుచ్చుటోపీ పెట్టింది. దాదాపు రూ.7 కోట్ల మేర వసూళ్లకు పాల్పడిన ఓ కుటుంబం స్థానికులకు టోకరా చేసి పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పరిధిలోని పొనుగుపాడులో నివసించే భీమేశ్వర్రావు, సుబ్బాయమ్మ దంపతులు.. స్థానికంగా మెడికల్, వస్త్రవ్యాపారం నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కొంత కాలంగా చిట్టీల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. స్థానికుల అవసరాలకు చిట్టీలు ఇస్తూ వారి నమ్మకాన్ని పొందారు. గ్రామంతోపాటు సమీప గ్రామాల వారు పలువురు భీమేశ్వర్రావు దంపతుల వద్ద చిట్టీలు వేస్తున్నారు. ఈ చిట్టీల విలువ దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుంది. గత రెండు రోజులుగా భీమేశ్వర్రావు ఇంటికి తాళం వేసి ఉండటం.. వారి ఫోన్లు స్విచ్ఆఫ్ అయి ఉండటంతో స్థానికుల్లో అనుమానం బలపడింది. ఇంటికి తాళం వేసి వెళ్తున్న వీరిని గమనించిన కొందరు అడగ్గా.. విహారయాత్రకు వెళ్తున్నామని జవాబిచ్చినట్లు తెలుస్తున్నది.
రెండు రోజులు కావస్తున్నా వారు రాకపోవడంతో గ్రామస్థులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ అజయ్బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్ముతో భీమేశ్వర్రావు కుటుంబం పరారీ కావడంతో పేద, మధ్యతరగతి కుటుంబీకులు లబోదిబోమంటున్నారు. తమ డబ్బు ఇప్పించాలని వారు పోలీసులను ప్రాధేయపడుతున్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..