(Chintamaneni) ఏలూరు: రాష్ట్రాన్ని పాలించే సత్తా జగన్ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే దోపిడీ చేయడం, దొంగల్ని చేరదీయడం అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల వారిని దోపిడీ చేస్తున్నారని, పేదలు అని కూడా చూడకుండా పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ను రద్దు చేయాలంటూ సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నా కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది.
జగనన్న గృహనిర్మాణ పథకం అంటూ తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఓటీఎస్ పేరుతో సెటిల్మెంట్లకు దిగుతున్నారని చింతమననేని ప్రభాకర్ ఆరోపించారు. ఇది ఓటీఎస్ కాదు.. ఓజేడీ అంటే ఒక్కసారి జగన్ దోపిడీ అంటూ ఎద్దేవా చేశారు. పేదవారికి గృహ హక్కు అంటూనే దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు గృహ హక్కు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అధికారులు, వాలంటీర్లకు లబ్ధిదారులు లొంగి ఓటీఎస్కు ఒప్పుకోవద్దని సూచించారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..