Prof K Nageshwar | ప్రొఫెసర్ నాగేశ్వర్ (Prof K Nageshwar)పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్లో కేసు నమోదైంది. ఓ టీవీ ఛానల్ డిబేట్ షోలో పాల్గొన్న నాగేశ్వర్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు టెంపరరీ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ అమిత్ షా అన్నాడని కామెంట్ చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇంద్రపాలెం పీఎస్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్తోపాటు సదరు టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంతకీ ఏమన్నారంటే..?
‘వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని తమ వాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాతో చెప్పారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు.. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్.. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడికి ఆయన పట్ల శత్రుత్వం ఉండొచ్చు. కానీ మనకు ఎందుకు ఉండాలి.. మీకు కూడా మంచి చెబుతున్నాను. మీకు ఆ అవసరం ఏంటీ..? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మనకు ఉపయోగపడతాడు.. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా.. మీకు కూడాఆ వైఖరి మార్చుకోండి’ అని సలహా ఇచ్చారు అని అన్నారు.