అమరావతి : (YS Jagan) ధాన్యం సేకరణ, కొనుగోళ్ల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలోనే ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోళ్ళు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోసం, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపి రైతుకు మంచి ధర వచ్చేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తప్పించామని, రైతులకు మంచి ధర వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు. వేగంగా పేమెంట్లు చేయడానికి ఇ–క్రాప్ బుకింగ్, ఇ-కేవైసీ అమలు చేయాలని సూచించారు.
వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపులు జరుపాలన్నారు. ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదన్నారు. ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని, శ్రీరంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతోపాటు అగ్రి మార్కెటింగ్, ఆర్ధికశాఖ, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు, ఏపీఎస్సీఎస్సీఎల్ వీసీ అండ్ ఎండీ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
నా చర్మంతో జగన్కు చెప్పులు కుట్టించినా రుణం తీరదు : నారాయణ స్వామి
సీక్రెట్గా క్వాంటం సూపర్ కంప్యూటర్ తయారుచేసిన డ్రాగన్
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..