అనంతపురం : (ASI Died) పెళ్లింట విషాదం నెలకొన్నది. తల్లి చనిపోయిన వార్త విని తట్టుకోలేని ఆమె కొడుకు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పరిధిలో జరిగింది. అప్పటిదాకా పెండ్లికొచ్చిన బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం వారిద్దరి మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించారు. ఇలాఉండగా, వరుడి నాయనమ్మ అయిన వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నది. పెండ్లయి కొద్ది సేపటికే ఆమె కన్నుమూసింది. తల్లి మరణ వార్త విన్న కుమారుడూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని దగ్గర్లోని దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
వాయు కాలుష్యంతో జాగ్రత్త.. గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..