(Covid Cases) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. మళ్లీ కొత్త కేసులు పెరిగాయి. గత రోజు 100 లోపే కొత్త కేసులు నమోదవగా.. ఈసారి ఆ సంఖ్య వందను దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి కొవిడ్ పాజటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1073 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కొవిడ్తో చనిపోయిన వారి సంఖ్య 14,492 కి చేరింది. ఇప్పటివరకు 20,76,687 కేసులు నమోదవగా 20,61,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3,12,30,356 శాంపిల్స్ పరీక్షించారు. జిల్లాల వారీ డాటా ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లాలో 27 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. చిత్తూరులో 26, గుంటూరులో 24, కర్నూలు జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరిగా జ్వర సర్వే నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ సహా వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షించారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..