హాలియా, ఏప్రిల్ 20 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా 600 మందికి టెస్టులు నిర్వహించగా 192 మందికి పాజిటీవ్గా వచ్చింది. అనుముల మండలంలో 38, గుర్రంపోడులో 23, పెద్దవూరలో 44, త్రిపురారంలో 23, నందికొండలో49, నిడమనూరులో15 కేసులు నమోదయ్యాయి. హాలియా పీహెచ్సీ పరిధిలో హాలియాలో 15, తిమ్మాపురంలో 2, పంగవానికుంటలో 4, చింతగూడెం, రాజవరం, నాయుడుపాలెం, యాచారంలో ఒక్కొక్కటి, జువ్విచెట్టుతండా, అల్వాల, కొత్తపల్లిలో రెండు చొప్పున, పంగవానికుంటతండాలో 3, బోయగూడెం గ్రామంలో 4 కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా బారిన పడిన వాళ్లందరూ హోం క్వారంటైన్లో ఉండాలని, వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని సూచించారు.
నల్లగొండ మండలంలో 27 మందికి
నల్లగొండ రూరల్ : మండలంలోని రాములబండ పీహెచ్సీలో మంగళవారం 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి కల్పన తెలిపారు.
కనగల్ పీహెచ్సీలో 75 మందికి పరీక్షలు చేయగా 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వరూధిని తెలిపారు.
మునుగోడు పీహెచ్సీలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి లహరి తెలిపారు.
మర్రిగూడ పీహెచ్సీలో 17 మందికి పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు డా.దీపక్ వెల్లడించారు. 50 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
కట్టంగూర్ పీహెచ్సీలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి నెహ్రూనాయక్ తెలిపారు.