AP Movie Tickets | సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే ఆన్లైన్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి మరో జీవోను తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిధిలో సినిమా టికెట్ల అమ్మకాలు జరిగేలా జీవో నం.142ను జారీ చేసింది. ఈ టికెట్ అమ్మకాలకు సంబంధించిన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) కు అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సినిమా టికెట్ల అమ్మకాలు జరపనున్నారు.
ఇప్పటివరకు ఏపీలో బుక్ మై షో, పేటీఎం వంటి ఆన్లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల అమ్మకాలు జరిగేవి. కానీ తాజా జీవో ప్రకారం ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మాత్రమే సినిమా టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. దీనికోసం ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ నూతన విధానం అమలయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. ప్రైవేటు ప్లాట్ఫామ్లతో పాటు.. థియేటర్లలో కూడా టికెట్లు కొనుగోలు చేసే సదుపాయం ఉండదని సమాచారం. ఇదిలా ఉంటే.. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇటీవల జగన్ ప్రభుత్వం జీవో నెం.35ను జారీ చేసింది. కానీ ఈ జీవోను సవాలు చేస్తూ థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. అయితే థియేటర్ల యాజమాన్యం ముందుగా సంబంధిత జేసీ వద్ద అనుమతి తీసుకుంటేనే.. టికెట్ల ధరలను పెంచుకోవచ్చని ఏపీ హోంశాఖ వివరణ ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
ఎక్కడో బహ్రెయిన్లో పుట్టిన మమతా మోహన్దాస్.. సౌత్లో హీరోయిన్ ఎలా అయ్యింది?
parampara in OTT | హాట్స్టార్ ఓటీటీలో పరంపర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?