(CM Jagan) అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని దత్తపీఠం ఆశ్రమానికి వెళ్లి దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీతో భేటీ అయ్యారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపిన జగన్ అమ్మవారి హారతి తీసుకున్నారు. చెప్పులు లేకుండానే ఆశ్రమానికి వచ్చిన జగన్కు దత్తపీఠం అర్చకులు, ఆశ్రమ పర్యవేక్షకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జనగ్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు.
దత్తపీఠం ఆశ్రమానికి వచ్చిన జగన్.. తొలుత సుప్రగణపతి, శ్యామకమలోచన దత్తాత్రేయ, హరకత రాజరాజేశ్వరీదేవి, గంగాధరేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో పూర్ణ ఫలాన్ని తాకి చేతికి రక్ష కంకణం ధరించారు. అనంతరం అవధూత స్వామీజీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా జగన్ ఆశ్రమంలోనే గడిపారు.
‘మురికి అంతా వేసుకొని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అనడం ఎందుకు. మనం కూడా వలంటీర్లుగా పనిచేయాలి. ప్రభుత్వానికి మన వైపు నుంచి తోడ్పాటునందించాలి. విపత్తు వచ్చి నోటికాడికి వచ్చిన పంట నాశనమైతే వెంటనే ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలదు? అప్పటికప్పుడే పంట మళ్లీ సృష్టించడానికి ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? వాళ్లూ మనుషులే కదా’ అని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తాను హిందూమతం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నదని సీఎం జగన్ తన వద్ద విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఆలయాల్లో వంశపారంపర్య అర్చక వ్యవస్థ గురించి ముఖ్యమంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు.
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
వైభవంగా పైడితల్లి అమ్మ సిరమానోత్సవం
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
ప్రపంచ గుర్తింపు కాదు.. ముందు ప్రజల ప్రేమను గెలుచుకోండి : హమీద్ కర్జాయ్
నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..