(Sirimanu Festival) విజయనగరం : శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా దసరా అనంతరం జరిగే ఈ సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు పరిసర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దాదాపు 55 అడుగుల పొడవైన సిరిమానుపై భాగంలో బిగించిన ఇరుసుపై ఏర్పాటుచేసే పీటపై ప్రధాన పూజారి కూర్చుని విసనకర్ర విసురుతూ భక్తులకు ఆశీస్సులిస్తుంటారు. ఈసారి పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. గజపతి రాజులు ఒకవైపు కట్టిన తాడును లాగడంతో సిరిమాను ఊరేగింపు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని దేవస్ధాన అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సూచించారు.
సిరిమాను అమ్మవారి ఊరేగింపు మూడు లాంతర్ల నుంచి రాజా బజారు మీదుగా కోట వరకు మూడుసార్లు తిప్పుతారు. ఈ సిరిమాను ఉత్సవాన్ని కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రభుత్వం తరఫున మంత్రి వెల్లంపల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అతి త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు కావాలని, రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులని ఉండాలని మొక్కుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండే ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల వలన రధోత్సవంలో భక్తులకు అనుమతి నిరాకరించారు.
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
ప్రపంచ గుర్తింపు కాదు.. ముందు ప్రజల ప్రేమను గెలుచుకోండి : హమీద్ కర్జాయ్
నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..