(Tulugu University) హైదరాబాద్: ఫీజులు చెల్లించలేని నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఫీజులను దాతల ద్వారా సమకూర్చుకునేందుకు నిర్ణయించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే స్పాన్సర్షిప్స్ పథకం ద్వారా ఫీజులు చెల్లించే కార్యక్రమానికి యూనివర్సిటీ అంకురార్పణ చేసింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ తెలుగు యూనివర్సిటీ పలు కోర్సులను నిర్వహిస్తున్నది. కొన్ని కోర్సుల ఫీజులు భారీగా ఉండటంతో పేద గ్రామీణ విద్యార్థులు చేరడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాలుగేండ్ల బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) కు రూ. 29, 830, రెండేండ్ల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) కు రూ. 45,700, ఎంఏ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం కోర్సుకు రూ. 12,040, పీజీ డిప్లొమా ఇన్ ఫిలిం డైరెక్షన్ కోర్సుకు రూ. 37,060 గా ఫీజులు ఉన్నాయి. ఇవే కాకుండా వివిధ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల ఫీజులు రూ.3,270 నుంచి రూ. 5,200 వరకు ఉన్నాయి. ఇక సెల్ఫ్ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రూ. 5 వేల నుంచి రూ. 37 వేల వరకు ఉన్నాయి.
ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నా, ఫీజులు ప్రతిబంధంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆయా ఫీజులను చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని దాతలు ఈ స్పాన్సర్షిప్ పథకం ద్వారా విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకురావాలని తెలుగు యూనివర్శిటీ అధికారులు కోరుతున్నారు. అందరికి కాకుండా విద్యార్థుల నేపథ్యం, ప్రతిభ, ఆర్థిక స్థితిగతులను బట్టి స్పాన్సర్షిప్ ద్వారా ఫీజులు చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు.
స్పాన్సర్షిప్స్ ద్వారా ఫీజులు సమకూర్చాలన్నది సొంత ఆలోచన అని, మారుమూల పల్లెలోని ఏ విద్యార్థి కూడా డబ్బు సమస్య కారణంగా చదువులకు దూరం కావొద్దన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు చెప్పారు. ఇప్పటికే కొంత మంది దాతలు ముందుకొచ్చారని, మరింత మంది సాయంతో ఎక్కువ మంది పేద విద్యార్థులను ఆదుకుంటామని తెలిపారు. పేద విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు ముందుకు వచ్చే దాతలు యూనివర్సిటీలో అధికారులను సంప్రదించవచ్చు.
వైభవంగా పైడితల్లి అమ్మ సిరమానోత్సవం
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
ప్రపంచ గుర్తింపు కాదు.. ముందు ప్రజల ప్రేమను గెలుచుకోండి : హమీద్ కర్జాయ్
నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..