ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 3: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ.వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతుండగా.. అతడి కుటుంబానికి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన నామా ట్రస్ట్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు. సదరు చెక్కును ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్కు సోమవారం అందజేశారు.
చికిత్స పొందుతున్న వేణుకుమార్ను ఇటీవల చూసి, అతడి పరిస్థితిని గమనించి చలించిపోయిన నామా.. తన నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సాయం పంపారని కమల్రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నామా సందేశాన్ని వినిపించారు. ‘నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. రాష్ట్ర యువతకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని నామా సూచించి భరోసా ఇచ్చినట్లు చెప్పారు. చెక్కును అందించిన వారిలో కమల్రాజుతోపాటు ట్రస్ట్ ప్రతినిధి కనకమేడల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు సామినేని హరిప్రసాద్, మోరంపూడి ప్రసాద్రావు, గడ్డం వెంకటేశ్వర్లు, వాకదాని కోటేశ్వరరావు, పెనుగొండ కొండలు, నాగరాజు, రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవికుమార్, షారుఖ్ ఉన్నారు.