తాండూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ( Employment Guarantee) నిర్వీర్యం చేయడమే కాకుండా కూలీల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను మానుకోవాలని సీఐటీయూ (CITU ) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం,వ్యవసాయ కార్మిక సంఘం తాండూరు మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్ డిమాండ్ చేశారు.
సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం తాండూర్ మండల కేంద్రం ఐబీలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వీబీజీ రాంజీ పథకంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పాత చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వీబీజీ రాంజీ పథకం చట్టాన్ని తీసుకురావడంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధి కూలీలకు నష్టం జరిగే విధంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో దుర్గం నానయ్య, బొల్లం రాజేశం, జైనేని రాజయ్య, జై నేని భూమయ్య, స్వామి, రాంబాబు, సారయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.