కుంటాల, నవంబర్ 27 సూర్యాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. గ్రామానికి బీటీ రోడ్డు, ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాట్లు, సీసీ రోడ్డు, డ్రైన్లు, రాజరాజేశ్వర ఆలయం, కల్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు దొంతుల శివాజీ, నాయకులు బక్కి భోజన్న, అయిటి రాజన్న ఉన్నారు.
బైంసాటౌన్, నవంబర్ 27 : మండలంలోని మాంజ్రి గ్రామం హనుమాన్ ఆలయ నిర్మాణానికి మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆయన స్వగృహంలో గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. హనుమాన్ ఆలయ నిర్మాణానికి రూ. 25 లక్షలు, మరాఠ సంఘం భవన నిర్మాణానికి రూ. 2.5 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు హన్మాండ్లు, మేరాజ్, సాయి ప్రసాద్ ఉన్నారు.
కుభీర్, నవంబర్ 27 : వచ్చే నెల పదో తేదీన గాలిసింగ్ తండాలో నిర్వహించనున్న సత్సంగ్కు రావాలని కోరుతూ స్థానిక గిరిజనులు ఎమ్మెల్యే విఠల్రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. గాలిసింగ్ తండాలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి మద్నాపూర్ మహారాజ్ రానున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ శ్యాంరావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, నాయకులు యఖీనొద్దీన్, శేరి సురేశ్ ఉన్నారు.