నిరంతర ప్రయత్నంతోనే విజయతీరాలకు చేరుకోవచ్చునని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుందని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ ఇన్ టెక్నాలజీ(విట్) క్లబ్ను ప్రారంభించారు. కలెక్టర్ వరుణ్రెడ్డి, ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ పాల్గొన్నారు.
బాసర, మార్చి 10 : నిరంతర ప్రయత్నం వల్లే విజయతీరాలకు చేరుకోవచ్చని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో అంగరంగ వైభవంగా అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు విద్యార్థినులు మహిళా అధ్యాపకులతో కలిసి ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్తో భారీ ర్యాలీ తీశారు. ట్రిపుల్ ఐటీ లోగోతో కూడి న మానవహారాన్ని నిర్వహించారు. అనంతరం ప్రియాంక వర్గీస్తో ట్రిపుల్ ఐటీలో చైల్డ్ కేర్ సెంటర్ను ప్రారంభించా రు. అనంతరం స్టూడెం ట్ యాక్టివిటి సెంటర్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొ న్నారు. అనంతరం కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్, ఉమెన్ సెల్ కన్వీనర్ పావని, శోభా, సృజన, సారిక, నాగలక్ష్మి, ప్రవళిక పాల్గొన్నారు.
విట్ క్లబ్ ప్రారంభం
బాసర త్రిబుల్ ఐటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం గల భవనంలో విట్ (ఉమెన్స్ ఇన్ టెక్నాలజీ) క్లబ్ను సీఎం వోఎస్డీ ప్రియాంక వర్గీస్, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటర మణ, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వల న చేసి ప్రారంభించారు.
ఆలయంలో పూజలు
బాసర సరస్వతీ అమ్మ వారిని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ దర్శించుకున్నారు. బాసర చేరు కున్న ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుంకుమా ర్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.