ఇచ్చోడ, ఫిబ్రవరి 4 : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఇచ్చోడలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందులను ప్రభుత్వం క్వింటాల్కు రూ. 6300 చొప్పున మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆన్రెడ్డి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మార్కెట్ కార్యదర్శి రమేశ్, సీఈవో రాథోడ్ ఈశ్వర్, నాయకులు ముస్తాఫా, దాసరి భాస్కర్, వెంకటేశ్, గైక్వాడ్ గణేశ్, ముస్కు గంగారెడ్డి, బత్తుల అశోక్, ప్రకాశ్, ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.
మండలంలోని మల్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీలు గాడ్గె సుభాష్, మెస్రం దేవ్రావ్, మడావి రామారావ్, నాగవేణి వెంకటేశ్, ఇచ్చోడ ఉపసర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం గ్రామాధ్యక్షుడు బాపురావ్ పాటిల్, ఉపాధ్యక్షుడు భూతి గంగయ్య, నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పాలనలోనే సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఇచ్చోడలోని తహసీల్ కార్యాలయంలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే బోథ్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్, మడావి భీంరావ్, రాథోడ్ ప్రకాశ్, ప్రవీణ్, ఇన్చార్జి తహసీల్దార్ జాదవ్ రామారావ్, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరికొండ, ఫిబ్రవరి 4 : మండల పరిషత్ కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మండలానికి చెందిన 17మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అలాగే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాయితీపై మంజూరైన ఫ్యాన్లు ఐకేపీ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు ఎక్బాల్ను పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సర్పరాజ్, ఐకేపీ ఏపీఎం సంతోష్ కుమార్, ఎంపీపీ అమృత్ రావ్, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.