ఆదిలాబాద్ రూరల్ : ఇటీవల కురిసిన భారీవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని వాన్వట్, మామిడిగూడల్లో వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అకాలవర్షాలతో పత్తి, సోయాబీన్ పంటలకు తీవ్రనష్టం జరిగిందని వివరించారు . పత్తి, సోయా పంటలు ప్రస్తుతం చేతికివచ్చాయని, ఈ సందర్భంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనావేసి నివేదికలివ్వాలని ఆదేశించారన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పుల్లయ్య, మండల వ్యవసాయాధికారి అశ్రఫ్, నాయకులు సెవ్వ జగదీశ్, జిట్టా రమేశ్ రైతులు పాల్గొన్నారు.