చింతలమానేపల్లి, మార్చి 31 : నాలుగేళ్ల క్రితం చింతలమానేపల్లి సమీపంలోని వాగుపై చెక్డ్యాం నిర్మించగా, ప్రస్తుతం పూర్తిగా అడుగంటిపోయింది. బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ చెక్డ్యాం కింద రైతులు రంది లేకుంట యేటా రెండు పంటలు తీస్తూ వచ్చారు.
నాడు నిండుకుండలా కళకళలాడిన ఈ చెక్డ్యాం.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేనితనంతో చుక్క నీరు లేక వెలవెలబోతున్నది. దీనిపై ఆధారపడి 50 ఎకరాల్లో వేసిన వరి, మిరప, మక్క చేతికందకుండా పోయే దుస్థితి నెలకొంది. పంట చేతికొచ్చే దశలో ఈ పరిస్థితి తలెత్తడంతో రైతులు వాగులో జేసీబీలతో గుంతలు తవ్వి.. అందులో మోటర్లు బిగించి పంటలకు నీరందించే ప్రయత్నం చేస్తున్నారు.