ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మేళనాలు జరుగుతున్నాయి. మంత్రి, జిల్లా కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నారు. శనివారం నిర్మల్ జిల్లా సోన్లో నిర్వహించిన సమ్మేళనంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఐకేరెడ్డి, బాసరలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్లో రేఖానాయక్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జిల్లా కో-ఆర్డినేటర్ గంగాధర్గౌడ్ పాల్గొన్నారు.
– ఆదిలాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ)
సోన్, మార్చి 25 : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినప్పటికీ కార్యకర్తల ఆత్మీయ అనుబంధాన్ని మరచిపోకూడదనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నిర్వహిస్తు న్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అట వీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ము న్నూరు కాపు సంఘ భవనంలో సోన్ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి నిధులు ఆపినా.. సీబీఐ, ఈడీలతో దాడులు చేయించినా.. ఏ మాత్రం అభివృద్ధిలో రాజీ పడడం లేదన్నారు. దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, ప్రజలు కూడా బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ప్రజలతో చర్చించి, విస్తరించేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని, ఇక్కడి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు కోరుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మహారాష్ట్రవాసులు ఇప్పటికే చాలా మంది పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఏప్రిల్ నుంచి సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షల సాయం అందిస్తామన్నారు. జిల్లాలో వచ్చే ఏడాది నుంచే సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో 40 ఎకరాల్లో రూ.250 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, దీనివల్ల పామాయిల్ సాగు చేసిన రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటా..
బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారని, వారి సేవలకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి భరోసానిచ్చారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో చురుకుగా పని చేయాల్సి ఉందన్నారు. కష్టపడి పనిచేస్తున్న నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అఖండ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రికి బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.
రాహుల్పై వేటు కక్షసాధింపే..
కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపేనని మంత్రి అల్లోల ధ్వజమెత్తారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆరోపించారు. కో ర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే రాహుల్గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం దేశచరిత్రలో చీకటి రోజుగా తమ పార్టీ భావిస్తున్నదని పేర్కొన్నారు. అంతకుముందు గొడిసిర్యాల రాజరాజేశ్వరస్వామి ఆలయం లో పూజలు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, సోన్ జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, బోండ్ల గంగాధర్, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతంరెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్యాదవ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మహేందర్రెడ్డి, సోన్ సర్పంచ్ టి.వినోద్, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి లింగవ్వ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ సారూ మేలు మరిచిపోం..
‘సారూ.. నేను 20 ఏండ్ల సంది ఎవుసం జేస్తన్న. గిటువంటి సర్కారును జూడనేలేదు. గత ప్రభుత్వాలల్లా ఎప్పుడు కరంటు పోయేదో.. ఎప్పుడు వచ్చేదో తెలియకపోయేది. చేను ఎండిపోతుందని రాత్రి పూట కరంటు పెట్టడానికి పోతే నా తోటోడు సచ్చిపోయిండు. గిప్పుడైతే కరంటు ఎప్పుడుంటున్నది. కేసీఆర్ సారూ మాకెంతో జేత్తండు. ఆయన మేలు మరచిపోము. రైతన్నకు తిప్పలు లేకుండా జేసిండు. ఆయన కూసున్నడో.. నిలుసున్నడో గని సల్లంగుండాలె.
– సోన్ ఆత్మీయ సమ్మేళంలో రైతు శ్రీనివాస్
ప్రభుత్వ పథకాలే గౌరవం పెంచాయి..
నేను మొట్టమొదటిసారిగా సర్పంచ్ గా అయిన. మాది జాఫ్రా పూర్ గ్రామం. మా గ్రామంలో ఎన్నో సమస్యలుండేవి. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో మా గ్రామాల్లో రూపురేఖలు మారిపోయాయి. ప్రతి వీధికి సీసీ రోడ్డు, పల్లె ప్రగతిలో సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం, ప్రకృతివనం వంటివి నిర్మించాం. గ్రామంలో అన్ని ఆలయాల పునఃనిర్మాణం మంత్రి అల్లోలతోనే సాధ్యమైంది. పంచాయతీ భవనం నిర్మించుకున్నాం. ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాల వల్లనే గ్రామంలో నాకు మంచి పేరు వచ్చింది. మంత్రి సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.
– కొరిపెల్లి సునీత, జాఫ్రాపూర్, సర్పంచ్.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు..
ఏ గ్రామంలో చూసినా ప్రభు త్వం అమలు చేసిన ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి ఇంటికీ ధైర్యాన్ని ఇచ్చింది. 24 గంటల కరెంటుతో రైతులకు రెండు పంటలకు పుష్కలంగా నీరం దుతు న్నది. గల్లీ గల్లీకి సీసీ రోడ్డు నిర్మించుకున్నాం. ఒకప్పు డు సీసీ రోడ్డు పోసుకుందా మంటే.. ఎన్నో దరఖాస్తులు ఇచ్చి వేచి ఉండే వాళ్లం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాలనీలో సీసీ రోడ్డు నిర్మించుకున్నం.
– మోహినొద్దీన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్, సోన్