తాండూర్, జూన్ 30 : తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో తవ్వినట్లు ఆనవాళ్లు కనబడడంతో పాటు అకడ ఓ అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజలు చేసినట్లు గుర్తులు ఉన్నాయి. గుప్త నిధుల కోసం తవ్వారా..? లేక ఏదైనా క్షుద్ర పూజల కోసమా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. మంగళవారం భూమి యజమాని చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి స్థానికులు అకడికి తరలివచ్చారు. పోలీసులు ఘటనా స్థలం వద్ద ఆనవాళ్లను పరిశీలించారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.