పెండ్లి షాపింగ్కు సంతోషంగా వెళ్లిన ఆ ముగ్గురు విగతజీవులుగా ఇంటికి చేరడం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద జాతీయ రహదారి మూలమలుపులో లారీ రూపంలో వచ్చిన మృత్యువు నలుగురిని కబళించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ డీఈ రఫతుల్లా, తన ఇద్దరు కూతుళ్లు, మరో బంధువు, డ్రైవర్తో కలిసి హైదరాబాద్కు వెళ్లి, తిరుగు ప్రయాణంలో పది నిమిషాల్లో ఇంటికి చేరేలోగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రఫతుల్లా, పెద్ద కూతురు, తమ్ముడి కొడుకు, డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో కూతురు తీవ్రగాయాలతో రిమ్స్లో చికిత్స పొందుతున్నది.
గుడిహత్నూర్, అక్టోబర్ 31 : మండలంలోని సీతాగోంది సమీపంలో గల జాతీయ రహదారి మూలమలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురితో పాటు మరొకరు నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జి ల్లాకేంద్రంలోని మసూద్ కాలనీకి చెందిన సయ్యద్ రఫతుల్లా అహ్మద్ జడ్పీ కార్యాలయంలో పంచాయత్రాజ్ శాఖలో డిప్యూటీ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన చిన్న కూతు రు పెండ్లి వచ్చే నెలలో ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి సామగ్రి కొనేందుకు కా రులో హైదరాబాద్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ వస్తున్నారు. మరో 10 ని మిషాల్లో తమ గమ్యస్థానానికి చేరుకుంటాం అనేలోగా లారీ రూపంలో వారిని మృతువు కబలించింది.
గుడిహత్నూర్ సమీపంలోని మే కలగండి మూలమలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ అతివేగం గా ఢీకొట్టడంతో ముందుగా వెళ్తున్న కంటైనర్ కిందికి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సయ్యద్ రఫతుల్లా అహ్మద్ (56), ఆయన కూతురు శబియా హష్మి (26), తమ్ముని కు మారుడు సయ్యద్ వహజాద్ (17), కారు డ్రైవర్ శంషొద్దీన్ (50) మృతి చెందారు. ఆ యన మరో కూతురు జుబియా హష్మి తీవ్రగాయాలతో బయటపడింది. గాయపడ్డా యు వతి ఆదిలాబాద్ రిమ్స్లో ఎంబీబీఎస్ చదువుతున్నది. కంటైనర్ కిందకు కారు దూసుకు వెళ్లడంతో కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టం కావడంతో స్థానికులు, జేసీబీల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన యువతిని చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లాకేంద్రంలో ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్చోడ సీఐ ముదావ త్ నైలు తెలిపారు. ప్రమాదం అనంతరం ఢీకొట్టిన లారీని డ్రైవర్ తీసుకొని పరారయ్యే క్రమంలో సీతాగోంది పెట్రోల్ బంకు సమీపంలో గుంతలో పడిపోయింది.
జిల్లాకేంద్రంలో విషాధచాయాలు..
ఎదులాపురం, అక్టోబర్ 31: గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పీఆర్ డీఈ సయ్యద్ రఫతుల్లా హైమద్ ( 55), ఆయన కుటుంబం , డ్రైవర్ దుర్మరణం చెందడంతో పట్టణంలో విషాదం నెలకొన్నది.
మూడేళ్ల క్రితం అనారోగ్యం..
డీఈ రఫతుల్లా మూడేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు మృత్యువుతో పోరాడి గెలిచారు. కానీ ఈ రోడ్డు ప్రమాదం నుంచి బయట పడలేకపోయారు. రఫత్కు మంచి అధికారి అని కీలక పనులు అప్పగించేవారు.
కొద్ది నెలల క్రితమే పెద్ద కూతురి పెళ్లి..
రఫత్కు ఇద్దరు కుమార్తెలు . పెద్ద కూతురు షబియా ( 25) డెంటిస్టు. తొమ్మిది నెలల క్రి తమే ఈమె పెళ్లి జరిగింది. ఈమె భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటుండగా, ఈ మధ్యే ఆదిలాబాద్కు వచ్చింది. చిన్న కూతురు రుబియా (22) ఆదిలాబాద్ రిమ్స్లో మెడికల్ ఆఫీసర్గా ఉన్నది. ఈమె తీవ్ర గాయాలతో ప్రస్తు తం చికిత్స పొందుతున్నది. కుమారుడు కూ డా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఇక ఈ ప్ర మాదంలో పెద్ద కూతురు, తమ్ముడి కుమారుడు వజహద్ (21), కారు డ్రైవర్ షంషొద్దీన్ ( 52) అక్కడికక్కడే మృతి చెందారు. రఫత్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్లో కూడా ఇల్లు ఉండగా, ఆయన భార్య అక్కడే ఉంటున్నది. ఆమె వీరితో కారులో లేదు.
నేడు అంత్యక్రియలు
ఆస్ట్రేలియా నుంచి కుమారుడు, అల్లుడు వచ్చి న తరువాత రతఫ్, కూతురు, తమ్ముడి కుమారుడి అంత్యక్రియలు నిర్వహించున్నట్లు బం ధువులు చెప్పారు. ప్రస్తుతం రిమ్స్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భద్రపరిచారు. కాగా డ్రైవర్ షంషొద్దీన్ బోథ్కు చెందిన వారు. ప్రసుత్తం కేఆర్కేకాలనీలో నివసం ఉం టున్నాడు. తాంసి, తలమడుగు, భీంపూర్, ఆదిలాబాద్ , జైనథ్ మండలాల ఆ తరం నాయకులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు రఫత్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
డీఈ రఫత్ కార్యదక్షుడు
భీంపూర్,అక్టోబర్ 31: ఉమ్మడి తాంసి మండలంలో పీఆర్ ఏఈగా పనిచేసిన రఫతుల్లా హైమద్ కార్యదక్షుడైన అధికారి అని మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు మడావి లింబాజీ అన్నారు. రఫతుల్లా ,ఆయన కు టుంబ సభ్యులు ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, భీంపూర్లో సర్పంచ్లు ఆయన సేవలను గుర్తుచేసుకొని ఆయనకు , కుటుంబానికి ఘన నివాళి అర్పించారు. ఇదిలాఉంటే పాత తరం ప్రజాప్రతినిధులు జీ శివ్వన్న, మేకల కిష్టయ్య తదితరులు కూడా విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్లు పెండెపు కృష్ణయాదవ్, నిమ్మ వేణుయాదవ్ , అజయ్, కరీం, నాయకులు నరేందర్యాదవ్, కపిల్ తదితరు ఉన్నారు.
ఘటనా స్థలంలోనే కంటైనర్లు ఢీ..
గుడిహత్నూర్, అక్టోబర్ 31 : సీతాగోంధి సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన స్థలంలోనే మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న వాహనాలు (కంటైనర్లు) అదుపు తప్పి ఒకదానికి ఒకటి వరుసగా మూడు కంటైనర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి మూలమలుపు వద్ద ప్ర మాద సూచిక బోర్డులు లేకపోవడం, ఎత్తైనకొండ ప్రాంతం వద్దనే మూలమలుపు ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వా హనదారులు పేర్కొంటున్నారు. జా తీయ ర హదారి అధికారులు వెంటనే స్పం దించి చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.