‘కాంగ్రెస్ లీడర్ల మాటలు దారుణంగా ఉన్నయ్. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా రైతులకు వీళ్లు చేసిందేమీ లేదు. నాడు ఎంతో గోస పెట్టిన్రు. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు అప్పుల బాధతో సచ్చిపోయినా మా దిక్కు సూడలే. గిప్పుడు గెలిచినట్లే పగటి కలలు కంటున్నరు.
వీళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, వచ్చేందుకు మభ్య పెడుతున్నరు. 24 గంటలు మంచిగున్న కరెంట్ను తీసేసి 3 గంటలు ఇస్తరట. అట్లయితే మళ్లీ పాతరోజులే వస్తయ్. మా బతుకులు ఆగమైతయి’ అని జిల్లా రైతులు మండిపడుతున్నరు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లతో బుద్ధి చెబుతమని స్పష్టం చేస్తున్నరు. ఎవుసాన్ని పండుగలా మార్చి, తమ గోస తీర్చిన కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటమని చెబుతున్నరు.
ఇంద్రవెల్లి, నవంబర్ 26: కాంగ్రెస్ లీడరు రేవంత్ రెడ్డి ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలంటున్నడు. ఏడ సరిపోతది. ఆయనకు అస్సలు తెలివి ఉండే మాట్లాడుతున్నడా..? మూడు గంటల కరెంటుతోని మూడు గంటలు కూడా తడ్వదు.సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటిత్తున్నడు. ఎప్పుడంటే అప్పుడు పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నం. కాంగ్రెస్ హయాంలో గతంలో కరెంటు కోసం ఎన్నో సార్లు రైతులంతా రోడ్డెక్కి, ఆందోళన చేసిన్రు. కానీ ఏనాడూ పట్టించుకోలే. కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ లీడర్ల చేతుల్ల కీలు బొమ్మలే. వీళ్లు తెలంగాణ బిడ్డలకు మంచి ఏడ చేస్తరు. ఏది చేయాలన్నా సీఎం కేసీఆర్తోనే అయితది.
ఆయనకు ప్రజలే అధిష్టానం. తెలంగాణల కాంగ్రెస్ రావడానికి కొద్దిగ కూడా చాన్స్ లేదు. బీజేపీకైతే అయితంకన్నా లేదు. మళ్లీ గెలిచేది కేసీఆరే. ఆలిగినా, గులిగినా మేం మేం ఒకటి. ఢిల్లీ వోన్ని, కర్ణాటకోన్ని మా నెత్తిన ఎక్కించుకోం. తెలంగాణ నిలబడాలంటే ఇక్కడ ప్రజలను ప్రేమించే లీడరు గావాలె. అది కేసీఆర్ ఒక్కరే చెత్తరు. గీ రేవంత్ రెడ్డి రాజకీయం తప్పా, ప్రజలు అవసరమే లేదు. గాయనను రైతులెవ్వరూ పట్టించుకోరు.
-కాగ్నే దీపక్, రైతు, ఇంద్రవెల్లి
తాంసి, నవంబర్ 26: సీఎం కేసీఆర్ సారు అచ్చినంకనే రైతులకు మేలు జరుగుతున్నది. రైతుబంధు ఇస్తుండడంతో పెట్టుబడి రంది లేకుండా పోయింది. అట్లనే ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నది. ఎనిమిదెకరాల్లో రెండు పంటలు పుష్కలంగా పండించుకుం టున్నం. రైతులు కూడా సంతోషంగా ఉన్నరు. కాంగ్రెసోల్లు మూడు గంటల కరెంటు ఇస్తే చాలంటున్నరు.
కానీ మూడు గంటల కరెంటిస్తే 30 గుంటలు కూడా పారది. భూమి ఎక్కువ ఉన్న రైతులు ఎక్కడిపోవాలే. వ్యవసాయం గురించి తెలిసినోళ్లు గిట్ల మాట్లాడరు. కాంగ్రెస్కు ఓటేస్తే రైతులు భూములను బీడు ఉంచుకొనే పరిస్థితి వస్తది. అసలే కాంగ్రెస్ ను రైతులు నమ్మరు. గిప్పుడు ఓటు కూడా ఎయ్యరు. ఇగ తెలంగాణల వాళ్ల దుక్నం బంద్ పెట్టుకోవాలె.
– గుకుంటి శ్రీకాంత్, రైతు, జామిడి, తాంసి మండలం
తాంసి, నవంబర్ 26: కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తమని పగటి కలలు కంటున్నరు. ప్రజలు వాళ్లను నమ్మేది లేదు.. ఓటేసేది లేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో మోసపూరిత హామీలు పెట్టి, ఏదో పిట్ట కథలు చెబుతున్నరు. గతంలో కాంగ్రెస్ హయాం లో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డం. కరెంట్ లేక నాకు న్న రెండెకరాల పొలం వద్ద ఆ జమానాలో రాత్రిపూట జాగా రం చేసింది ఇంకా మర్శిపోలే. గిప్పుడిప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రెండు పంటలు పండిస్తున్న. ఎవుసానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నడు.
అది చేను తడిసేందుకు ఏ మూల కు సరిపోదు. పది హెచ్పీ మోటర్లను బోర్లకు బిగించుకోవా లని అంటున్నడు. అంటే రైతులను మళ్లీ అప్పుల పాలు కమ్మని చెబుతున్నడు. ఇగ వీళ్ల లెక్కలన్నీ గిట్లనే ఉంటయి. వీళ్లకు ఎద్దెర్కలేదు. ఎవుసం ఎర్కలేదు. రైతుకు లాభం చేసే మాట చెప్పుడు చేతకాకుంటే ఊకోవాలె. గిట్ల ముంచేందుకు సూడొద్దు. ఆయన గా కాంగ్రెసోళ్ల మాటలు ఎవలు ఇంటరు. వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇగ తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్కటే ఉంటది. రైతుల దెబ్బెకు కాంగ్రెసోళ్లు ఇగ పోటీ చేసుడంటే భయపడాలే.
– పసుపుల వెంకట స్వామి, రైతు, రామచంద్రపూర్, తలమడుగు మండలం
ఉట్నూర్ రూరల్, నవంబర్ 26 : ధరణిని బంగాళాఖాతంలో కలుపుతమని కాంగ్రెసోళ్లు అంటున్నరు. ధరణిని కాదు వీళ్లను బంగాళాఖాతంలో కలుపుతం అని ప్రజలు అంటున్నరు.. ఇగ ఈ ఎన్నికల తర్వాత వాళ్లు కనిపించరు. దళారుల రాజ్యం తెద్దామనే కాంగ్రెసోళ్లు అనుకుంటున్నరు. వీళ్ల కుట్రలు నడవవు. ఈ ప్రాంత ప్రజలు చాలా తెలివి ఉన్నోళ్లు. గట్టిగనే వాతలు పెట్టబోతున్నరు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణితోని మా భూములకు రక్షణ కలిగింది. ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే పని తప్పింది. గింత మంచిగ చేసిన కేసీఆర్ను ఎందుకు కాదనుకుంటం. కాంగ్రెసోళ్లకు గట్టిగ బుద్ధి చెప్పుడే. మంచి చేసినోళ్లనే ప్రజలు కావాలనుకుంటరు. ప్రజలకు మంచి చేసుడంటే కేసీఆర్ సారు ఒక్కరితోనే అయితది. ఆయన ఏం జేసినా ఆలోచించే చేస్తరు.
-అమ్రు నాయక్, ఉట్నూర్
భీంపూర్, నవంబర్ 26: కాంగ్రెసోళ్లు మూడు గంటల కరంటే ఇస్తరట.. ఇగ మళ్లా కటిక చీకట్లనే బతుకుడయితది. గతంలో వాళ్ల పాలనను ఇంకా మర్శిపోలే. కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. సీఎం కేసీఆర్ పుణ్యమని కరెంట్ గిప్పుడు 24 గంటలు ఉంటున్నది. ఆయనేం జేసినా ప్రజలకు మంచి చేస్తరు. గది ఓర్వలేకే కాంగ్రెసోళ్లు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ లీడరు రేవంత్ రెడ్డికి అసలు ఎవుసం అంటే తెలుసా.. ఆయనకు రైతులంటే కొద్దిగనన్న గౌరవం లేదు. ఆయన మాట్లాడుడు చూస్తుంటే మళ్లీ పాత రోజులే తెచ్చేటట్లు ఉన్నడు. నాకుఅంతర్గాంలో మాకు ఐదెకరాల భూమి ఉన్నది.
రైతుబంధు అందుతున్నది. 2 ఎకరాలు పత్తి, ఎకరం కంది పంట ఉన్నది. మిగతా రెండు ఎకరాల భూమిల ఇపుడు యాసంగి పంట వేస్తున్న. కూరగాయలు కూడా పండిస్తాం. నేనే కాదు మా అంతర్గాంల రైతులంతా పెన్గంగ పక్కనే ఉన్నా ఒక పదేండ్లకింద రెండు పంటలు కూడా తీసేది కాదు. గిప్పుడు అందరూ ఖుషీగా పంటలు వేసుకుంటున్నరు. 3 హెచ్పీ మోటరుతోనే తడులిస్తు న్నాం. రైతులను ముంచేటి కాంగ్రెసోళ్లను నమ్మం. అయినా వాళ్లు గెలిస్తే కదా.. రైతులెవ్వలూ వాళ్లకు ఓటెయ్యరు. మళ్లీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఎంబడే ఉంటం.
-ఆనంది భూమయ్య, చిన్నకారు రైతు,అంతర్గాం
తాంసి, నవంబర్ 26: మాది ఖోడద్ గ్రామం. నాకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మా రామచంద్రపూరు గుట్టల మధ్య ఉన్నది. ఎక్కువ మంది రైతులం వ్యవసాయం పంపుసెట్లు ఉపయోగించి భూములు సాగు చేస్తం. ఇక్కడ అత్యధికంగా కరెంటు వినియోగం అవుతుంది. భూములు ఎత్తు ప్రాంతంలో ఉండడంతో భూగర్భజలాలు లోతులో ఉంటయ్. ఇప్పుడు ఇక్కడి గ్రామ రైతులం మూడు హెచ్పీ, ఐదు హెచ్పీలోపు కరెంట్ మోటర్లు వినియోగిస్తున్నం.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 హెచ్పీ మోటర్లు పెట్టాలంటున్నరు. అట్లయితే రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఖర్చులు తడిసిమోపడవుతయ్. ప్రస్తుతం బీఆర్ఎస్ ఇస్తున్న కరెంట్ సరఫరా విధానమే బాగుంది. 24 గంటల కరెంటుతో పత్తి, శనగతోపాటు కూరగాయలు పండిస్తున్న. పండిన కూరగాయలు రైతుబజార్లో అమ్మడంతో లాభాలు వస్తున్నయ్. ఇగ మూడు గంటల కరెంటిచ్చే ఆ పెద్ద మనిషి పార్టీని మేం పట్టించుకోం. వాళ్లు బంగాళాఖాతంలో కలుసుడు ఖాయం.
– ప్రేమచంద్, రైతు ఖోడద్, తలమడుగు మండలం