నా పేరు కుమ్ర సంతోష్కుమార్. మాది పాండుగూడ గ్రామం. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి, రెండు విడుతలకు చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.56 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి పదో విడుత వరకు యేడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.2.80 లక్షలు వచ్చాయి. తాజాగా రూ.35 వేలు రానున్నాయి. సాగుకు ముందే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతుండడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించాలంటే షావుకార్ల దగ్గరకు వెళ్లి వడ్డీకి రుణాలు తెచ్చేది. పంట అమ్మినా రుణం తీరేది కాదు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు మేలు జరుగుతున్నది. రైతుబంధుతోపాటు రైతుబీమా, వ్యవసాయ రుణాలు, వ్యవసాయ సామగ్రిని సబ్సిడీపై అందిస్తున్నారు.
– కుమ్ర సంతోష్కుమార్, పాండుగూడ, సిరికొండ మండలం