రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 582 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి రెండు వాహనాలు ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగం గురించి వివరిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కూడా అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యల ఫలితంగా పోలింగ్ శాతం పెరుగుతోంది.
– ఆదిలాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): ఈ యేడాది జనవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సవరించింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 582 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 4,26,096 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు, 2,25,062 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,11,039, మహిళలు 1,14,016, ఇతరులు ఏడుగురు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో 301 పోలింగ్ కేంద్రాలు, 2,01,034 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 98,456, మహిళలు 1,02,576, ఇతరులు ఇద్దరు ఉన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఓటర్ల జాబితాలో తప్పులు ఉండకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఓటర్ల చివరి జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు అధికంగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. పకడ్బందీ ఓటర్ల జాబితా తయారు, ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యల ఫలితంగా పోలింగ్ శాతం పెరుగుతోంది.
విస్తృతంగా అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రైతులు, మహిళలు, యువత, కులవృత్తులతోపాటు అన్ని వర్గాలకు ఉపయోగపడుతున్నాయి. ఫలితంగా జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. యువత, మహిళలు, వృద్ధులు తమ ఓటు వేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలుకుని, ఎంపీ ఎలక్షన్ వరకు ఆసక్తి చూపుతూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 83.46 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 80.93 శాతం, బోథ్ నియోజకవర్గంలో 85.38 శాతం నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఓటు వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో సైతం అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ప్రతి నియోజకవర్గంలో రెండు వాహనాలను ఏర్పాటు చేసి ఈవీఎం, వీవీ ప్యాట్ ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రతి వాహనానికి డిప్యూటీ తహసీల్దార్తోపాటు సిబ్బంది, పోలీసులు ఉంటారు. జిల్లాలోని 582 పోలింగ్ కేంద్రాల్లో నెల రోజులపాటు ఓటు వినియోగంపై అవగాహన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 13: ఈనెల 15వ తేదీలోగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రా హుల్ రాజ్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ చై ర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి పా ల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమై కు మ్రం భీం చౌక్, ఎన్టీఆర్ చౌక్, నేతాజీ చౌక్, వినాయక్ చౌక్, మీదు గా కలెక్టరేట్కు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఇందులో భాగంగానే పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ యేడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండే ప్రతి ఒక్కరూ ఈనెల 15వ తేదీలోపు బీఎల్వోలు, తహసీల్దా ర్ కార్యాలయంలో సంప్రదించి ఫారం-6 ద్వారా ఓటరు నమోదు చేసుకోవాలని, చనిపోయిన లేదా చిరునామా తొలగింపునకు ఫా రం-7 మార్పులు, చేర్పులకు ఫారం-8 పూర్తి చేసి సరిచేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యుల ఓటు హ క్కు వివరాలను https://www.nvsp.in పోర్టల్లో ఎపిక్ నం బర్ ద్వారా పరిశీలించుకోవాలని తెలిపారు. ఇన్చార్జి డీఆర్వో అరవింద్ కుమార్, జిల్లా యువజన, క్రీడా సంక్షేమ అధికారి వెంకటేశ్వ ర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నలంద ప్రియ, కలెక్టరేట్ పర్యవేక్షకులు స్వాతి, రాజేశ్వర్, ఈడీఎం రవి, తదితరులున్నారు.