కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 1,09,642 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.132. 87 కోట్ల సాయం అందుతున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది. యాసంగి సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ ఖా తాల్లో డబ్బులు జమ చేయకపోవడంతో రై తులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రైతులకు విడుతల వారీగా వారం రోజుల్లో నే రైతు బంధులు డబ్బులు పూర్తి స్థాయిలో అందేవి. మొదట ఎకరం ఉన్నవారికి, ఆ త ర్వాత రెండెకరాలు ఉన్న వారికి, ఆ త ర్వాత మిగతా వారికి డబ్బులు ఖాతాల్లో పడుతుండేవి.
ఇక రాష్ట్రంలో కొత్త ప్రభు త్వం కొలువు దీరింది. యాసంగి సీజన్ ఇప్పటికే ప్రారంభమై, రైతులంతా తమ పనుల్లో ఉన్నారు. పెట్టుబడి కోసం ప్రతి ఏడాది లాగే సాయం అందుతుందని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. ఇప్ప టి వరకు పెట్టుబడి సాయం ఖాతాల్లో పడకపోవడంతో రైతాంగమంతా ఆందోళన చెందుతున్నది. అయితే ప్రభుత్వం మా త్రం రైతు బంధు సాయం అందించే ప్రక్రి య మొదలైందని చెప్పింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాల్లో డ బ్బులు జమయ్యాయనే సమాచారం మా త్రం అధికారుల వద్ద స్పష్టంగా లేదు. కేవ లం రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇప్పటివరకు సాయం అందలే దు. దీంతో తమ ఖాతాల్లో డబ్బు ఎప్పుడు జమవుతుందని రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
యాసంగి పంటల సాగుకు రైతులు ఇప్పటికే మొదలుపెట్టారు. చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ సారి అసలు రైతుబంధు డబ్బులు వ స్తాయా.. లేదా అని రైతులంతా ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి, మక్క, శనగ వంటి పం టలు వేసుకున్నారు. ఇక పెట్టుబడి సాయం అందితే ఎరువులు, ఇతర వ్యవసాయ ఖ ర్చులకు ఉపయోగపడుతాయని రైతులు ఎ దురు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రే పు, మాపు అంటూ కాలక్షేపం చేస్తున్నదని మరికొందరు మండిపడుతున్నారు.
రైతుబంధు సాయం కోసం రైతాంగం నిరీక్షిస్తున్నది. యాసంగి సీజన్ మొదలైనా, పంట పెట్టుబడి ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నది. నేడు, రేపు అంటూ అధికార యంత్రాంగం చెబుతుండగా, కర్షకలోకం ఖాతాల్లో చూసుకోవడంతో పాటు సెల్కు వచ్చే సందేశాల కోసం ఎదురుచూస్తున్నది. రైతాంగానికి అండగా నిలవడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదికి రెండు విడుతలుగా ఈ సాయం అందించింది. కాగా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటివరకు అందించకపోవడంతో, ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కెరమెరి, డిసెంబర్ 20: నా పేరు కుడ్మెత గోపాల్. నాకు ఐదెకరాల భూమి ఉంది. వానకాలం పంటలో పత్తి, కందులు పండించాను. ప్రస్తుతం నువ్వులు, మొక్కజొన్నతో పాటు మినుములు, పెసర పంట వేసేందుకు భూమి సిద్ధం చేసుకున్న. సాగుకు పెట్టుబడి అందక ఇబ్బందయ్యేలా ఉంది. గతంలో ఈపాటికే పెట్టుబడి సాయం అందేది. ఈ సారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కొంత జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నరు. రైతు భరోసా అన్నరు. ఇప్పటికైతే రైతు బంధే అమలు చేస్తమంటున్నరు. అదన్న ఈ టైంలో ఇస్తే రైతులకు ఉపయోగమైతది. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా ఏర్పాట్లు చేయాలె.
కెరమెరి, డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటకు పెట్టుబడి సాయం విడుదల చేయాలి. ప్రస్తుతం యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో రైతుబంధు సాయం అందితే విత్తనాలు, ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ భూములు దుక్కులు దున్ని పంటలు వేసుకున్నం. ఇంకా డబ్బు అందకపోతే సాగుకు ఇబ్బందైతది. సకాలంలో పెట్టుబడి రాకపోతే మళ్లీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకునుడైతది. నాకున్న నాలుగెకరాల భూమిలో పత్తి, కంది పంటలు వేయగా, యాసంగిలో జొన్న, శనగ పంట వేశా. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇచ్చి అండగా నిలవాలె.
– సుర్పం గణపతి, రైతు చౌపన్గూడ