ఉట్నూర్, మే 4 : వ్యవసాయంపై ఆధారపడే గిరిజన రైతులకు మరింత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐ టీడీఏ ఆధ్వర్యంలో . ఫలితంగా వచ్చే ఆదాయంతో గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని యోచిస్తున్నది. ఇందుకోసం విజయ డెయిరీతో ఐటీడీఏ సంయుక్తంగా ముందుకు సాగుతున్నది. పశువుల పెంపకానికి అవసరమయ్యే దాణ, గడ్డి విత్తనాలు అందిస్తూ గిరిజన రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని 30 గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికచేసింది. గిరిజన రైతులకు బ ర్రెలను అందించనున్నారు. ఒక్కో గ్రామానికి కనీ సం 300 లీటర్ల సేకరణ లక్ష్యంతో ముందుకు సా గుతున్నారు. మొత్తానికి గిరిజన రైతులకు ఉపాధి దొరకడంతో పాటు ఏజెన్సీలో పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడనున్నది. ఏజెన్సీలో నీటి ప్రాజెక్టులు లేనందున వర్షంపై ఆధారపడి పంటలు పండించే రైతులకు ఇది వరంగా మారనున్నది.
త్వరలో పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు
ఏజెన్సీ ఐటీడీఏ కేంద్రమైన ఉట్నూర్లో పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి స్థానిక కుమ్రంభీం ప్రాంగణంలో స్థలంతో పాటు నిధులు కేటాయించారు. పాల శీతలీకరణ కేంద్రం నిర్వహణ, ఉట్నూర్ చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి కనీసం గ్రామానికి 300 లీటర్లను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు పాల నాణ్యత ను తెలుసుకునేందుకు సుమారు రూ.8 లక్షలు వె చ్చించి 20 మిల్కో టెస్టర్లను కొనుగోలు చేసి పంపీణీ చేయనున్నారు.
పాల మిత్రులకు ఉచిత శిక్షణ..
ఉట్నూర్ ఐటీడీఏ కేంద్రంలోని కుమ్రంభీం ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య, ఐటీడీఏ సహకారంతో పాలమిత్రలకు ఎలక్ట్రానిక్ మిల్కో టెస్టర్ వినియోగంపై శిక్షణనిచ్చారు. పాల మిత్రులు గిరిజన రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ పాల నాణ్యతకు కృషి చేయనున్నారు. వీరికి గుజరాత్ రాష్ట్రంలో విజ్ఞాన యాత్రలు నిర్వహించి పాల సేకరణను పెంచేలా పాలమిత్రలను ప్రోత్సహించనున్నారు. దాణ, పాల ఉత్పత్తి, వెన్న శాతం పెంచడం లాంటి తదితర అంశాలపై మరింత శిక్షణ ఇవ్వనున్నారు.
విజయ డెయిరీ సక్సెస్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2021న స్థాపించిన విజయ డెయిరీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. రోజుకు 20వేల లీటర్ల పాల సేకరణ, పాల ప్యాకింగ్ చేస్తూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. కుమ్రం భీం జిల్లాలో ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోజుకు 1000 లీట ర్ల చొప్పున పాల సేకరణతో ప్రారంభించిన పాలశీతలీకరణ కేంద్రం నేడు 1800 లీటర్ల సేకరణకు చేరుకున్నది. వీటిని స్ఫూర్తిగా తీసుకొని ఏజెన్సీలో మరో పాలశీతలీకరణ కేంద్రం ప్రారంభానికి ఏ ర్పాట్లు చేస్తున్నారు. పాలకు రోజురోజుకూ డి మాండ్ పెరగడంతో ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోడానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గిరిజన రైతులకు ప్రోత్సాహం..
గిరిజన రైతులకు పాడి పశువులు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ద్వారా ఈ ప్రయత్నం ముందుకు సాగుతున్నది. ఉట్నూర్ కేంద్రంగా పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు ఐటీడీఏ స్థలం, నిధులు కేటాయించింది. దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ఉట్నూర్లో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు, దానికి పాలను అందించేందుకు 20 గ్రామాల్లో కనీసం 300 లీటర్ల పాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పాల మిత్రులకు రాష్ట్ర పాడి పరిశ్రమ ద్వారా శిక్షణ ఇచ్చాం. గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు ఐటీడీఏ పీవో చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
– మధుసూదన్రావు, విజయ డెయిరీ డీడీ, ఆదిలాబాద్