కుభీర్, ఏప్రిల్ 16: ఆరోగ్య తెలంగాణే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రా థమిక ఆరోగ్యకేంద్రం ఉండేది. దీంతో ప్రజలు వైద్య సేవలకోసం నానా తంటాలు పడేవారు. పేదల అవసరాలకు అనుగుణంగా మారుమూ ల ప్రాంతాలక వైద్య సేవలను విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆరోగ్య ఉప కేంద్రాలు ‘పల్లె ధవాఖాన’లుగా హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా మారాయి. దీంతో కు భీర్ మండలంలో 8ఆరోగ్య ఉప కేంద్రాలు రూ పు రేఖలను సంతరించుకున్నాయి. ఫలితంగా ప్రతి రోజు ఈ దవాఖానల్లో వందలాది మందికి వైద్య సేవలు అందుతున్నాయి.
కుభీర్ మండలంలోని పల్సి, సిర్పెల్లి తండా, గోడ్సర, నిగ్వా, మాలేగాం, పార్డి(బీ), డోడర్న, చాత గ్రామాల్లో అరకొర వసతులతో ఏఎన్ఎం, ఆశ వర్కర్తో ఈ ఉపకేంద్రాలు కొనసాగాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం వీటిని బలోపేతం చేస్తూ సిబ్బంది నియామకానికి శ్రీకారం చుట్టిం ది. ఒక డాక్టరు లేదా ఎల్ఎంహెచ్పీలను మెడికల్ ఆఫీసర్లుగా నియమించారు. ఒక్కో పల్లె ద వాఖానలో ఇద్దరు ఏఎన్ఎంలు, చుట్టు పక్కల గ్రామాల ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. ప్రస్తు తం పల్లె దవాఖానలు కొత్త రూపును సంత రిం చుకున్నాయి. మెరుగైన వైద్యం ఇక్కడ అం దుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె దవాఖానల్లో సా ధారణ సంప్రదింపులు , రోగ నిర్ధారణ, బీపీ చె కప్, క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు 14 రకాల ప రీక్షలు చేస్తున్నాం. రోగులకు సంప్రదింపులు మాత్రమే కాకుండా ఉచితంగా మందులను అందజేస్తున్నాం. పల్లె ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నాం.
-విఘ్నేష్, ఎల్ఎంహెచ్పీ, మాలేగాంవ్
ప్రతి నెలా పల్లె దవాఖాన పరిధిలోని గ్రామాల గర్భిణులు పరీక్షలు చేసి మందులు అందిస్తు న్నాం. వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు వారానికో సారి చేస్తు న్నాం. అవసరమైన వారికి మందులు అందజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నాం.
-గల్వే మంగమణి, ఏఎన్ఎం, సిర్పెల్లి
గతంలో ఇలాంటి సౌ కర్యాలు పల్లెల్లో లేవు. పల్లె దవాఖానల్లో మంచి సౌలతులు ఉన్నయ్. డా క్టర్తో పాటు సిస్టర్లు, ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నరు. బీపీ, షుగర్కు మందులు, గోళీలు ఇస్తు న్నరు. గర్భిణులకు పరీక్షలు చేసి అవసరమైన మందులిస్తున్నరు.
-సింధే అనిల్, మాజీ సర్పంచ్, చాత