గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర సర్కారు బీమా సౌకర్యం కల్పించింది. ఈ మేరకు మంగళవారం బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కార్మికులతో కలిసి ఎంపీపీ తుల శ్రీనివాస్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణానంతరం ఇస్తున్న రూ.5వేలను కూడా రూ.10 వేలకు పెంచినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.