ఓటు వజ్రాయుధమని అధికారులు ప్రజాప్రతినిధులు పిలుపు నిచ్చారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పే రు నమోదు చేసుకోవాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఆయా చోట్ల ర్యాలీలు తీశారు.
బోథ్, జనవరి 25: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీనియర్ ఓటర్లు, యువ ఓటర్లు, ఉత్తమ బూత్ స్థాయి అధికారులను తహసీల్దార్ సుభాష్ చందర్ సన్మానించారు. ఎంపీడీవో సుశీల్ రెడ్డి, ఎస్ఐ రాము, డీటీ సూరజ్, నాయబ్ తదితరులు పాల్గొన్నారు.
మండలకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఓటు ప్రాముఖ్యతపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీయట్ అధికారి రవీందర్ పాల్గొన్నా రు. కరస్పాండెంట్ రాజశేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రవీన్ రెడ్డి, కార్తీక్, దీప, ముత్యం, సతీశ్, నరేశ్, నవీన్, ప్రసాద్, రాజేశ్వర్, స్వామి, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 25 : నేరడిగొండలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఓటు నమోదుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బ హుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్ రెడ్డి , ఆర్ ఐ నాగోరావ్, సీనియర్ అసిస్టెంట్ మీరాబాయి, సర్పంచ్ పెంట వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర, ప్రధానోపా ధ్యాయులు మణిలత, పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 25: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల ని తహసీల్దార్ తుకారాం అన్నారు. తహసీల్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించా రు. సర్పంచ్ సునీత, డీటీ రామారావ్, ఎంఈవో ఉదయ్రావ్ పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలో గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి తహసీల్ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు ప్రతి జ్ఞ చేశారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తహసీ ల్దార్ విజయ్కుమార్, డీటీ ఉపేందర్, ఆర్ఐ విలాస్, కాం ప్లెక్స్ హెచ్ఎం రాధాకృష్ణ, సర్పంచ్ నర్మద పాల్గొన్నారు.
బజార్హత్నూర్ జనవరి 25: బజార్హత్నూర్ గ్రామంలో యు వకులు, విద్యార్థులతో కలిసి తహసీల్దార్ శంకర్ ర్యాలీ నిర్వహిం చారు. ఓటు హక్కు గురించి ప్రజలకు అవగహన కల్పించారు. ఉపాద్యాయులు, సిబ్బంది, బీఎల్వోలు, పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి 25: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పా ఠశాల వద్ద ఓటరు నమోదుపై రెవెన్యూ శాఖ అధికారులు, ఉ పాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, గిర్దావర్ మెస్రం లక్ష్మణ్ పాల్గొన్నారు.
నార్నూర్, జనవరి 25: ఓటు హక్కు వజ్రాయుధం వంటిందని తహసీల్దార్ జాడి రాజా లింగం అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలంలో అధికారులు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, ప్రజాప్రతినిధులు, యువకుల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ప్రిన్సిపాల్ ఉపేందర్, మహేందర్, కేజీబీవీ ప్రత్యేకాధికారులు హిమబిందు, ప్రియాంక, రెవెన్యూ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, జనవరి 25: మండలకేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గురువారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, రెవె న్యూ ఇన్స్పెక్టర్లు నితిన్, విజయ్, హెచ్ఎం లస్మన్న, జూనియర్ అసిస్టెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జనవరి 25: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వి ద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ జాదవ్ సునీత, డీటీ భాగ్యలక్ష్మి, ఎంఈవో ఆర్ నారాయణ, ఎంపీవో లింగయ్య, ఎస్ ఐ సయ్యద్ ఇమ్రాన్, హెచ్ఎం దేవిదాస్, ఆర్ఐ అరుణ్, బీఎల్ వోలు అశోక్, ఛాయా, సంగీత, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, జనవరి 25: మండలకేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యా లీ నిర్వహించి తహసీల్దార్ లక్ష్మి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్, ఎంపీడీవో భూమయ్య, ఎంఈవో శ్రీకాంత్, నాయ బ్ తహసీల్దార్ విష్ణు జాదవ్, జూని యర్ అసిస్టెంట్ దారవేణి రాఘవేంద్ర, ఉపాధ్యా యులు పవన్, సౌజన్య పాల్గొన్నారు.
తాంసి(భీంపూర్), జనవరి 25: మండలంలోని పిప్పల్కోటి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. హెచ్ఎం వైద్య మహేశ్, ఉపాధ్యాయులు రమేశ్, శంకర్, వీర కుమార్ పాల్గొన్నారు.
ఉట్నూర్, జనవరి 25: పట్టణంలోని ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి మాట్లాడుతూ యువత ఓటు హక్కును పొందాలని సూచించారు. డీటీ భుజంగ్రావు, నాయకులు ధరణి రాజేశ్ పా ల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ప్రమాణం చేయించి ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రిన్సిపాల్ పావని వివరించారు. అధ్యాపకులు కేశవులు, మంజు ల, శ్రీ నివాస్, సువర్ణ, శ్రీలత, గణేశ్, వినోద్, లక్ష్మణ్ పాల్గొన్నారు.