ఎదులాపురం, డిసెంబర్28: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమ విజయవంతానికి వైద్యాధికారులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి బీ మంజునాథ్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డీఎంహెచ్వోలు, కార్యక్రమ నిర్వహణాధికారులు, డీఈవోలు, డీడీఎంలకు బుధవారం రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి శిబిరానికి వచ్చే వారికి పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదయ్యేలా చూడాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన పలు విషయాలపై సూచనలు, సలహాలుచేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ధన్రాజ్, డీపీఎం అనిల్ ఎన్హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు.