పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయే లేదో.. దళారులు దందాకు తెరలేపారు. మార్కెట్ యార్డుల్లోనే కొనాలన్న నిబంధనను ఉల్లంఘించి పల్లెల్లో దర్జాగా కాంటాలు పెట్టేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 7100 ధర నిర్ణయించగా, ఏమాత్రం లెక్క చేయకుండా తమకు తోచినంత చెల్లిస్తున్నారు. ఇక తేమ పేరిట ఇష్టారీతిన కోత విధిస్తుండగా, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయో లేదో.. దళారులు రంగంలోకి దిగారు. పల్లెల్లో ఇష్టానుసారంగా పత్తిని కొనుగోళ్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మార్కెట్ యార్డుల్లో పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా, అధికారుల కాలయాపన వల్ల రైతులు ఇబ్బందిపడక తప్పడం లేదు. పంట అమ్ముకొని అప్పులు తీర్చాలనుకునే రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తుండగా, ఇదే అదనుగా భావించి వారు దోచుకుంటున్నారు. సీసీఐ పత్తి ధర రూ.7,100గా నిర్ణయించగా, వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించుకోవాల్సి వస్తుం ది.
మార్కెట్ యార్డుల్లోనే పత్తికొనుగోళ్లు జరుపాలని, లేని పక్షంలో లైసెన్స్లు రద్దు చేస్తామని మార్కెట్ కమిటీ హెచ్చరిస్తున్నప్పటికీ వ్యాపారులు భయపడడం లేదు. ఇష్టానుసారంగా తమ వ్యాపార సముదాయాల వద్దే కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ను ఏమాత్రం లెక్క చేయకుండా క్వింటాలుకు రూ. 500 నుంచి రూ. 1000 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం యేటా మద్ద తు ధర ప్రకటిస్తున్నా.. వ్యవసాయ మార్కెట్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు ఈ పరిస్థితి తప్పడం లేదు.
జిల్లాలోని పత్తి వ్యాపారులు జైనూర్, సిర్పూ ర్, వాంకిడి, కెరమెరి మండలాల్లోని పల్లెలకు వెళ్లి.. కాంటాలు పెట్టి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 7100 ఉండగా, పత్తి తేమ పేరిట క్వింటాలుకు రూ. 6000 నుంచి రూ. 6500 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 8శాతం వరకు తేమ ఉన్న పత్తికి పూర్తి మద్దతు ధర ఇవ్వాలని, 12శాతం తే మ ఉంటే రూ. 7 వేల ధర ఇవ్వాలని ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోవడం లేదు. తేమ పేరిట కోత లు విధిస్తున్నారు. ఇక్కడ సేకరించిన పత్తిని వాహనాల్లో తమ వ్యాపార సముదాయాలకు తరలించుకుంటున్నారు.
మార్కెట్ కమిటీల కంటే ముందే కొనుగోళ్లు ప్రారంభించి తమ గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల ద్వారా మహారాష్ట్ర తరలిస్తున్నారని తెలుస్తోంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్తో పాటు జైనూర్ మార్కెట్ కమిటీలు కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ట్యాక్సీ రూపంలో రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా జీరో వ్యాపారం సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.