దండేపల్లి, ఫిబ్రవరి25 : దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో 8 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సాలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సప్తాహ భజనలు, పరిసమాప్తము, ఏకాంతసేవా తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ప్రధాన అర్చకులు రఘుస్వామి, అర్చకులు సంపత్స్వామి, వేద పండితులు నారాయణశర్మ ఉన్నారు.