ఉమ్మడి పాలనలో రైతులు అరిగోస పడ్డారు. సరిపడా కరెంట్ లేక, అస్తవ్యస్తమైన భూ రికార్డులతో ఆగమయ్యారు. పాసుబుక్కుల్లో భూములు తారుమారు కావడంతో తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. భూముల భద్రతకు పటిష్టమైన ధరణి పోర్టల్ తెచ్చింది. అనేక మాడ్యూళ్ల ద్వారా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర ప్రక్రియలను సులభతరం చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు ఎవుసానికి 3 గంటల కరెంట్ సాలనీ, ధరణిని బంగాళఖాతంలో కలుపుతమని ఆగం చేస్తున్నారు. వారి విధానాలను తెలంగాణ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మమ్మల్ని పరేషాన్ చేస్తున్న కాంగ్రెస్సోళ్లకు బుద్ధి చెబుతమని ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.
ధరణి తీసేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు
ధరణిని తొలగిస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు. ధరణి కంటే ముందు రెవెన్యూ కార్యాలయాల్లో దళారులు ఉండేవాళ్లు వాళ్ల ద్వారా వెళితేనే పనులు జరిగేవి. పహ నీ కావాలన్నా, మార్పులు చేర్పు లు, భూ ములకు సంబంధించిన సమస్యలు ఏవైనా దళారులతోనే జరిగేవి. తాత ముత్తాల పేరున ఉన్న భూమి వారసులకు పట్టా కావాలంటే ఆఫీసుల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగినా పట్టా కాకపోతుండే. ఇప్పుడు తెలం గాణ ప్రభుత్వం ధరణి తేవడంతో దళారుల కనుమరుగయ్యారు. ఆన్లైన్ విధానంలో రైతులకు కావాల్సిన అన్ని భూముల సర్టీఫికెట్లు అందుబాటులోనికి వచ్చాయి. ధరణిని తీసివేస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నరు. మళ్లా దళారులు రాజ్యమేలుతరు. మళ్లా రైతులకు అష్టకష్టాలు పడుతరు. ఏ పని కావాలన్నా లంచాలు ఇవ్వనిదే పని కాదు. రైతుల కోసం ఇంత మంచి ధరణి పోర్టల్ తెచ్చిన సీఎం కేసీఆర్ సారునే మళ్లా గెలిపించుకుంటాం.
-సడ్మెక చంద్రయ్య, ఎల్లూర్, పెంచికల్పేట్ మండలం
దళారుల కోసమే పట్వారీ వ్యవస్థ
వాంకిడి,నవంబరు 29: ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది.ధరణి పోర్టల్ను రద్దు చేస్తే పైరవీకారుల రాజ్యం మళ్లొస్తది. దీంతో దళారుల ప్రమేయం పెరిగి రైతుల భూములను గోల్మాల్ చేసే అవకాశం ఉంది. గతంలో భూమి రిజిస్ట్రేషన కావాలంటే పైరవీకారులను ఆశ్రయించాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ధరణిని తీసుకురావడంతో వ్యవసాయ భూములు భద్రంగా ఉన్నాయి. గతంలో యజమానికి తెల్వకుండానే భూమి ఇంకొకరి పేరు మీదికి మార్చేది. కేసీఆర్ ఆలోచనతో ధరణి తీసుకొచ్చి రైతు ప్రమేయం లేకుండా మరొకరి పేరు మీదికి భూ మి మార్చే వీలు లేకుండా ఉంది. స్వయంగా రైతు వెళ్లి వేలు ము ద్ర వేస్తేనే రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా చేశారు. ధరణితో దర్జాగా ఉంటున్నాం. అందుకే సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి. ధరణి ఉండాలి.
– జుగునక మారు,రైతు,దాబా గ్రామం.
మళ్లీ భూములన్నీ పడీత్ అవుతాయి
రైతుల భూములకు సాగునీరు సక్రమంగా అందిస్తేనే పంటలు పండుతాయి. 24 గంటల కరెంటుతో మా రైతుల భూములు పచ్చగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండదు. మూడు గంటల కరెంట్తో పంటలు పండవు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు రాక అప్పుల పాలవుతరు. మళ్లీ భూములన్నీ మళ్లీ పడావుగా మారిపోతాయి. రైతులు మళ్లీ ఆగమవుతరు. కసీం పహనీలు కూడా దొరకని పరిస్థితి వస్తుంది.
– తెలిగె మల్లయ్య, ఎల్కపల్లి, పెంచికల్పేట్ మండలం
కాంగ్రెస్ను నమ్మితే బతుకు ఆగమే
వాంకిడి,నవంబర్29: కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటూ ఎన్నికల మ్యానిఫోస్టోలో మోసపూరిత హామీలు ఇస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అక్కడ వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన వద్ద వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్నాడు. అది చేను తడిసేందుకు ఏ మూలకు సరిపోదు. 10హెచ్పీ మోటర్లను బోర్లకు బిగించుకోవాలని చెబుతున్నారు. అలా చేస్తే రైతు వ్యయప్రయాసాలతో ఇబ్బందులకు గురికాక తప్పదు. భూగర్భజలాలు చాలా లోతుకు పడిపోతాయి. అందుకే కాంగ్రెస్ ప్రకటించే మోసపూరిత హామీలను నమ్మితే ఆగమవుతాం. రైతుకు నిరంతరం ఉచిత కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కి అండగా నిలబడాలి. రైతుల మేలుకోరే సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి.
– సెండే.అంబరావ్,రైతు,నౌధరి గ్రామం
పోర్టల్ లేకుంటే దగాకోరు రాజ్యమే
వాంకిడి,నవంబర్ 29: రైతులు భూ తగాదాలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ పునరాలోచించి ఎంతో ప్రతిష్టా త్మకంగా ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. ప్రభుత్వమే భూ సమస్యలను పరిష్కరించడంతో భూతగాదాలు లేకుండా రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతుల జీవితాలలో వెలుగులు నింపిన ధరణి పోర్టల్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి తీసేస్తాం అంటున్నారు. ఒకవేళ అలా జరిగితే మళ్లీ సమస్యలు రావడంతో పాటు దళారీలు రాజ్యమేలుతారు. భూసమస్యలు పెరిగి రైతులకు గొడవలు మొదలవుయి. ధరణి పోర్టల్తో భూసమస్యలన్నీ తీరాయనుకుంటే, రాష్ట్రంలో రాక్షస పాలనను అవలంభించేందుకు కాంగ్రెస్ప్రయత్నిస్తున్నది.వారి మాటలు ఎవరు నమ్మరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రవేశ పెట్టడంతో రైతులకు వరంలా మారింది. ఇప్పుడు స్థానికంగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే స్లాట్ బుక్ చేసుకొని ఇచ్చిన టైంకి వెళ్లే రిజిస్ట్రేషన్ సులభంగా,వేగంగా అయిపోతుంది. నేరుగా పాస్పుస్తకం ఇంటికే వస్తుంది. రైతులు ఒక్కసారి ఆలోచన చేసి ధరణి పోర్టల్ పోకుండా ఉండేందుకు కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి మళ్లా కేసీఆర్ సారు ప్రభుత్వాన్నే గెలిపించుకుంటాం.
– వి.గౌరయ్య,రైతు,నార్లపూర్ గ్రామం
రైతులపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది
రైతులు సంతోషంగా ఉండడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఆలోచిస్తోంది. కరెంటుని 3 గంటలకు కుదిస్తాం. పహనీలో కౌలుదారుకు అవకాశం కల్పిస్తాం అంటున్నారు. వాళ్ల పాలనలో రైతులు కరెం ట్, నీళ్ల కోసం నానా కష్టాలు పడ్డారు. ఎవు సంపై ఎలాంటి అనుభవం లేని వాళ్లు కూడా రైతుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్తో మడి మొత్తం పారతది. మూడు పంటలు పండుతయా.. ఇలా మాట్లాడే కాంగ్రెసోళ్లకు సిగ్గుండాలె. మళ్లా వచ్చి రైతులను ఎక్కడ కాకుండా చేద్దామని కుట్ర పన్నుతున్నారు. మళ్లీ అలాంటి రోజులు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల మాయ మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. రైతులను ఆదుకుంటున్న కేసీఆర్ సారునే మళ్లీ గెలిపించుకుంటం
– గోమాసే తులసీరాం, గంగాపూర్, చింతలమానెపల్లి మండలం
కౌలు రైతులకు అధికారం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది
రైతుల పట్టా భూములను కౌలు రైతులకు అప్పజెప్పాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇప్పుడు తెలంగా ణ ప్రభుత్వం ధరణి తేవటంతో దళారుల ఆటలు సాగడం లేదు. ఆన్లైన్ విధానంలో రైతులకు కావాల్సిన అన్ని భూ ముల సర్టిఫికెట్లు అం దుబాటులోకి వచ్చాయి. కాంగ్రెసోళ్ల పాలనలో తాత ము త్తాత ల పేరున ఉన్న భూమి పట్టా కావాలంటే పట్వారీ, ఆఫీసు ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టా కాకపో తుం డే. లంచాలు ఇవ్వకపోతే పని కాకపోతుండే. దళా రుల రాజ్యం నడుస్తుండే.. ధరణి తీసివేసి మళ్లీ దళారుల రాజ్య ం తేవాలని కాంగ్రెస్ చూస్తోంది. కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెబుతం.మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే గెలిపించుకుంటాం.
-చౌదరి చిరంజీవి, గంగాపూర్, చింతలమానెపల్లి మండలం
ఆన్లైన్ విధానమే పారదర్శకంగా ఉంది..
ఆన్లైన్ పహనీలలో ఉన్న పారదర్శక విధానం చేతి రాత పహనీలలో ఉండవు. ఒకరి భూమిపై మరొకరిపేరుని రాసి రైతులను ఇబ్బందులు పెడతారు. ధరణిని తొలగించాలని అలోచించే కాంగ్రెస్కు రైతులు గుణపాఠం చెబుతారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడపాలని కుట్ర పన్నుతున్నరు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తేవడంతో స్లాట్ బుక్ చేసిన ఒక్క రోజులోనే భూమి రిజిస్ట్రేషన్, మ్యూటివేషన్ జరుగుతుంది. దీంతో ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే పట్టాలు జరుగుతున్నాయి. దీంతో రైతులకు ఎలాంటి బాధలు లేవు. ధరణి తొలగిస్తే మళ్లీ చేతిరాత పహనీలు వస్తాయి. అప్పుడు ఇష్టం వచ్చినట్లు భూ తగాదాలను సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ భూ దళారులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి మాయమాటలు చెప్పే వాళను నమ్మం. మళ్ల కేసీఆర్ సారుకే ఓటు వేసి గెలిపించుకుంటాం
-చాపిడె సంజీవ్, ఎల్లూర్, పెంచికల్పేట్ మండలం
అప్పటి కరెంట్ కష్టాలు మళ్లీ వద్దు..
వాంకిడి,నవంబర్ 29: అప్పటి కరెంటు కష్టాలు మళ్లీ రావద్దు. రాత్రి పూట కరెంటు ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెల్వదు. కరెంటు సరిగా రాక పంటలు ఎండిపోయేవి. తెలంగాణలో ఇప్పుడు 24గంటల కరెంటు వస్తుండడంతో రైతులు అవసరం వచ్చినప్పుడల్లా నీళ్లు పారించుకుంటున్నరు. ఎవుసం సక్కగా ఉంది. రెండు పంటలు పండిస్తు రైతు రాజాగా జీవిస్తుండు. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులు బావుల కాడ పండుకోవాలె. కరెంట్ ఎప్పుడు వస్తదో నిద్ర మానుకొని రాత్రి చేను కాడ పండాలె. మళ్లా 10హెచ్పీ మోటరు పెట్టుకోవాలే అంటున్నరు. అలాంటి మోటరును నేను ఎప్పుడు చూడలే. ఆ కష్టం మళ్లీ మాకు వద్దు, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే గెలిపించుకుంటం.
– బాలజీ,రైతు,తేజపూర్ గ్రామం