మంచిర్యాల, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ జాబితా ప్రకారమే ప్రమోషన్లు, బదిలీలను ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం దరఖాస్తు ప్రతులను ఉన్నతాధికారులకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఒకసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక వాటిని మార్చుకునే అవకాశం ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
జిల్లాల వారీగా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1900 ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధులు నిర్వ హిస్తుండగా, ఇందులో 242 మందికి తప్పనిసరిగా స్థాన చలనం కలగనున్నది. 160 మందికి పదోన్న తులు వచ్చే అవకాశమున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 1,044 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ప దోన్నతులు, బదిలీలు నిర్వహించనుండగా, ఇం దు లో 541 మంది తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కావా ల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో 615 మందికి పదోన్నతులు, బదిలీలు నిర్వహించనుండగా, ఇందులో సుమారు 250 మంది తప్పనిసరిగా స్థానచలనం పొందాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలో 847 మం దికి పదోన్నతులు, బదిలీలు నిర్వహించనుం డగా, ఇందులో 612 మంది తప్పనిసరిగా స్థానచలనం పొందాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఈ సంఖ్యల్లో మార్పు ఉండే అవకాశముంది.
మార్గదర్శకాలు ఇవీ..