ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహించడం, స్నాక్స్ ఇవ్వడం, స్లిప్ టెస్టులు పెట్టడం వాటితో మంచి ఫలితాలు వచ్చాయి.
– ఇచ్చోడ, మే 13
రోజూ ఎనిమిది గంటలు చదివా..
10 జీపీఏ సాధించడానికి చాలా కష్టపడ్డా. రోజు 6-8 గంటలు చదివా. కానీ.. 9.8 జీపీఏ వచ్చింది. అయినా చాలా ఆనందంగా ఉంది. టీచర్లు బాగా బోధించడంతోనే మంచి గ్రేడ్ వచ్చింది. ఇంటర్లో టాప్ ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తా. బాసర ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అవుతానని నమ్మకం ఉంది.
– జాదవ్ లావణ్య 9.8 గ్రేడ్ విద్యార్థి, గిరిజన బాలిక గురుకులం, ఇచ్చోడ
స్టడీ అవర్స్ ఉపయోగపడ్డాయి..
పదో తరగతి పరీక్షల సందర్భంగా చివరి నెలలో నిర్వహించిన స్టడీ క్లాస్లు మాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం స్నాక్స్ ఇచ్చి ప్రోత్సహించింది. సందేహాల ను స్టడీ అవర్స్లో క్లియర్ చేసుకున్నాం. 9.8 జీపీఏ సాధించినందుకు సంతోషంగా ఉంది. స్కూల్లో నిర్వహించిన పరీక్షలతోనే మంచి గ్రేడ్ సాధించా. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 9.8 జీపీఏ గ్రేడ్ సాధించా. మంచి గ్రేడ్ రావాలని బాగా కష్టపడ్డా.
– ప్రణవ్, 9.8, మహత్మాజ్యోతిభా ఫూలే గురుకులం, నర్సాపూర్
ఐదో తరగతి నుంచి చదువుతున్నా..
నేను నర్సాపూర్ జ్యోతిబా ఫూలే గురుకులం ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతి నుంచి చదువుకుంటున్నా. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి జీపీఏ సాధించా. 10 జీపీఏ సాధించాలనుకున్నా. కానీ.. కొన్ని సబ్జెక్టుల్లో రాణించక పోయా. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలువాలని ఉంది.
– అంగ సురేశ్, 9.7 గ్రేడ్, మహత్మాజ్యోతిబా ఫూలే, నర్సాపూర్
పటిష్టమైన ప్రణాళికతో..
ఉపాధ్యాయులు పటిష్టమైన ప్రణాళిక రూపొందించారు. ప్రాక్టీస్ చేసుకోవ డానికి స్టడీ అవర్స్ ఉపయోగపడ్డాయి. స్టడీ మెటీరియల్ చాలా ఉపయోగడింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు.
– ఎం.ఝాన్సీరాణి 9.7 గ్రేడ్, విద్యార్థి, జడ్పీ ఉన్నత పాఠశాల, ఇచ్చోడ