నిర్మల్ చైన్గేట్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రం కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని శుక్రవారం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందనేది వివరించడమే కాకుండా ప్రతిపక్షాల ఆరోపణలు, విష ప్రచారాలు, విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం రాకముందు పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని తిప్పికొట్టేలా దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూలై 28 : మున్నూరుకాపు మిత్ర మండలి యువజన సంఘం కార్యవర్గ స భ్యులు శుక్రవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిని ఘనం గా సన్మానించారు. అధ్యక్షుడు గంట రాకేశ్, సభ్యులు నరేందర్, అనిల్, ప్రవీణ్, సందీప్, పూదరి శివ, చంద్రశేఖర్, చిరంజీవి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు మా రుగొండ రాము, పాకాల రాంచందర్, కొండ శ్రీధర్, పద్మాకర్, ధర్మాజీ శ్రీనివాస్, శ్రీధర్, సాయికృష్ణ తదితరులున్నారు.