నిర్మల్ అర్బన్, జనవరి 8 : విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆ సక్తిని పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని సెయింట్ థామస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను విజయవంతం చేసేందుకు విద్య శాఖ అధికారులు పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకలు విజయవం తం చేసేందుకు కృషి చేయాలని అధికారులు, నిర్వాహకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇ స్తున్నారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫా రూఖీ రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు వచ్చే విద్యార్థులు, గైడ్ టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన, రవాణా, వసతి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు డీఈవో రవీందర్ రెడ్డి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. అంశాల వారీగా ఒక్కో కమిటీకి బాధ్యతలు అప్పజెప్పారు. సమష్టిగా మేళాను జయప్రదం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో తొలి సారిగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించనున్నారు. వీరితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వా కాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ దేవసేన, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారె డ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎంపీ సోయం బా పురావ్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపుల కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాం బాబు, ఆర్జేడీ సత్యనారాయణ, ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్లర్ వెంకట రమణతో పాటు పలువురు ప్రముఖలు హాజరుకానున్నారు.
రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లలో ఎంపిక చేసిన ప్రదర్శనలను రాష్ట్రస్థాయి వైజ్ఞానిక మేళాలో ప్రదర్శించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 33 జి ల్లాల నుంచి 796 ప్రదర్శనలు రానున్నా యి. వీరితో పాటు 796 మంది విద్యార్థులు 796 మంది గైడ్ టీచర్లు హాజరుకానున్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనలను ఎంపిక చే యడానికి బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొ ఫెసర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూ పిన జూనియర్, సీనియర్ విభాగాల నుం చి జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు.
విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై దృష్టి సారించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా జిల్లా స్థా యి సైన్స్ఫెయిర్ నిర్వహిస్తున్నారు. కరోనా కా రణంగా వాయిదా పడ్డ మేళాను ఇటీవలే విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు నిర్మల్ జిల్లా తొలి సారిగా ఎంపిక కావడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి సారిగా నిర్మల్లో నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్కు నిర్వహణకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చదువు, ఆటలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేలా ఈ ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేయనున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 796 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. ప్రతి ప్రదర్శనకు విద్యార్థితో పాటు ఒక గైడ్ టీచర్ హాజరుకానున్నారు. వీరందరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశాం. ప్రదర్శన కేంద్రంలో ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అగ్ని మాపక వాహనాలు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకు న్నాం. ప్రదర్శనలను విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేశాం.
-రవీందర్ రెడ్డి, నిర్మల్ డీఈవో